సినిమాలో ఐటెమ్ సాంగ్‌ ఆఫర్ పేరుతో యువతికి టోకరా, సాంగ్‌కు రూ.10లక్షలు ఇస్తానని మోసం

సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన విశాఖలో వెలుగుచూసింది. మిథునం

  • Published By: naveen ,Published On : June 19, 2020 / 09:33 AM IST
సినిమాలో ఐటెమ్ సాంగ్‌ ఆఫర్ పేరుతో యువతికి టోకరా, సాంగ్‌కు రూ.10లక్షలు ఇస్తానని మోసం

సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన విశాఖలో వెలుగుచూసింది. మిథునం

సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన విశాఖలో వెలుగుచూసింది. మిథునం సినిమాలో చాన్స్ పేరిట గీతా అయ్యర్స్ స్టూడియో గీతా ప్రసాద్ గ్యాంగ్ ఎర వేసింది. సాంగ్ కు రూ.10లక్షలు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బులో రూ.5లక్షలు తమకు కమిషన్ గా ఇవ్వాలని యువతితో బేరం కుదుర్చుకున్నారు. అయితే అంతకంటే ముందు బడ్జెట్ సరిపోలేదని ఒకసారి, సినిమా ఆగిందని మరోసారి కారణం చెప్పి డబ్బు సర్దాలని యువతిని కోరారు. గీతాప్రసాద్ గ్యాంగ్ ని నమ్మిన యువతి, తన ఆస్తి తనఖా పెట్టి రెండు దఫాల్లో రూ.5లక్షలు గీతా ప్రసాద్ కు ఇచ్చింది. 

అయితే ఎంతకీ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చిన యువతి తన డబ్బు కోసం గీతాప్రసాద్ ను నిలదీసింది. ఓ హోటల్ కు వెళ్తే ఆ వ్యక్తి డబ్బు ఇస్తాడని గీతాప్రసాద్ చెప్పడంతో ఆ యువతి హోటల్ కు వెళ్లింది. హోటల్ లో యువతిని కలిసిన వ్యక్త, వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అక్కడి నుంచి బయటపడ్డ బాధితురాలు పోలీసులను ఆవ్రయించింది. 

తన డబ్బు తనకు ఇవ్వమని అడుగుతుంటే దౌర్జన్యం చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని గీతా ప్రసాద్ గ్యాంగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలాగే ఇప్పటివరకు 10మంది యువతులను ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి గీతా ప్రసాద్ గ్యాంగ్ మోసం చేసిందని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. గీతాప్రసాద్ గ్యాంగ్ పై పలు కేసులు నమోదు చేశారు.

Read: ఏపీలో ఒకేరోజు 465 కరోనా కేసులు, నాలుగు మరణాలు