తీవ్ర విషాదం, మాస్కులా చుట్టుకున్న చున్నీ ప్రాణం తీసింది

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చున్నీ, ఓ నిండు ప్రాణం తీసింది. మాస్కులా ముఖానికి చుట్టుకున్న చున్నీ ఆమె ప్రాణం

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 10:05 AM IST
తీవ్ర విషాదం, మాస్కులా చుట్టుకున్న చున్నీ ప్రాణం తీసింది

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చున్నీ, ఓ నిండు ప్రాణం తీసింది. మాస్కులా ముఖానికి చుట్టుకున్న చున్నీ ఆమె ప్రాణం

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చున్నీ, ఓ నిండు ప్రాణం తీసింది. మాస్కులా ముఖానికి చుట్టుకున్న చున్నీ ఆమె ప్రాణం పోవడానికి కారణమైంది. మృతురాలి పేరు లక్ష్మీదేవి(26). కడప జిల్లా గోపవరం మండలం పెదపోలుగుంట గ్రామ నివాసి. లక్ష్మి తన పిల్లలు, భర్త సుబ్రమణ్యంతో కలిసి పనుల కోసం తన పెద్దనాన్న ఉంటున్న చీమకుర్తికి 10 రోజుల క్రితం వెళ్లింది. అక్కడ పనులు లేకపోవడంతో సుబ్రమణ్యం దంపతులు ఆదివారం(జూన్ 7,2020) బైక్ పై స్వగ్రామానికి బయలుదేరారు. 

బతికి బయటపడ్డ బాబు:
భార్య లక్ష్మీ ముఖానికి చున్నీ కట్టుకుని బైక్ పై వెనుకవైపు కూర్చుంది. మార్గంమధ్యలో ప్రకాశం జిల్లా, పామూరు మండలం భూమిరెడ్డిపల్లి దగ్గర లక్ష్మీదేవి ముఖానికి చుట్టుకున్న చున్నీ ప్రమాదవశాత్తు బైక్ వెనుక టైరులో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె వాహనంపై నుంచి జారి రోడ్డుపై బలంగా కింద పడింది. తలకు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగినప్పుడు ఆమె తన కుమారుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రయాణిస్తోంది. తల్లితో పాటు బాబు కిందపడినా.. బాబుకు గాయాలేమీ కాలేదు. కళ్ల ముందే లక్ష్మి చనిపోవడంతో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.  మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

Read: క్వారంటైన్ కేంద్రంలో దారుణం, యువతితో అసభ్య ప్రవర్తన