ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన వైసీపీ కార్యకర్తలు..ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాల్లోనే పంపిణీ
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నేతలు ఓటర్లకు గాలం వేస్తోన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలు యదేశ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
YCP activists distribute money to voters : ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నేతలు ఓటర్లకు గాలం వేస్తోన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో యదేశ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాల్లోనే డబ్బులు పంచుతూ ఓ వైసీపీ కార్యకర్త అడ్డంగా బుక్కయ్యాడు.
నర్సీపట్నంలోని 26వ వార్డులో ఓ వైసీపీ కార్యకర్త డబ్బులు పంచుతుండగా… టీడీపీ నేతలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం డబ్బులు పంపిణీ చేసిన వ్యక్తిపై టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
రేషన్ పంపిణీ వాహనాల్లో డబ్బులు పంపిణీ వెనుక ఎవరి హస్తం ఉందో పోలీసులు విచారణ చేపట్టి, వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ డిమాండ్ చేశారు.