మున్సిపాలిటీల్లోనూ వైసీపీ ఆధిపత్యం..

మున్సిపాలిటీల్లోనూ వైసీపీ ఆధిపత్యం..

YCP dominates in municipalities : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లోనూ వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పలుచోట్ల అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో చాలా చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. అలా కొన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ ఇప్పటికే పాగా వేసింది.

గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ అన్ని వార్డులను వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. మాచర్లలో మొత్తం 31 వార్డులు ఉండగా.. అన్నింటినీ వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా సాధించుకున్నారు. అటు పిడుగురాళ్లలో కూడా ఇదే పరిస్థితి.

ఇక్కడ మొత్తం 33 వార్డులుండగా.. అన్నింటిలోనూ వైసీపీ పాగా వేసింది. అటు చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవసం చేసుంది. ఇక్కడ 31 వార్డులుండగా.. అన్నిచోట్లా వైసీపీనే ఏకగ్రీవం చేసుకోగలిగింది.