Velampalli Srinivas : ఎన్టీఆర్‌ కుమార్తె ఆత్మహత్యపై ఏపీ మాజీ మంత్రి వెలంపల్లి సంచలన వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించి, నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉమామహేశ్వరి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే.

Velampalli Srinivas : ఎన్టీఆర్‌ కుమార్తె ఆత్మహత్యపై ఏపీ మాజీ మంత్రి వెలంపల్లి సంచలన వ్యాఖ్యలు

Velampalli Srinivas : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించి, నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉమామహేశ్వరి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుధవారం (ఆగస్టు3,2022) ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమామహేశ్వరి ఆత్మహత్యపై స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ వెలంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Uma Maheshwari : ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య.. కారణం ఏంటి? అసలేం జరిగింది?

చంద్రబాబు దరిద్రపుగొట్టు రాజకీయాల కారణంగా ఎవరు బలవుతున్నారో తెలియడం లేదని చెప్పారు. మిగిలిన తమ ఎంపీలను కూడా బీజేపీలోకి పంపేందుకు జాతీయ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు పిలువకున్నా మోదీ కాళ్లు పట్టుకునేదుకు ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇలాంటి గజదొంగను దేశంలో ఎవరూ నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. త్వరలోనే చంద్రబాబు నీచ, నికృష్ట రాజకీయాలు బట్టబయలు అవుతాయని వెల్లడించారు. వైసీపీని ఎదుర్కొనే సత్తా ఏపీలో ఉన్న పార్టీలకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా జగన్‌ను ఓడించలేరని స్పష్టం చేశారు.