Korrapadu: పొలంలో రోడ్డు.. వైసీపీ నాయకులే వేశారంటూ సీఎం జగన్‌కు రైతు రిక్వెస్ట్!

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కొర్రపాడు గ్రామంలో తమ పంట పొలాలను వైసీపీ నాయకులు నాశనం చేశారని ఆరోపించారు నాగలింగారెడ్డి అనే రైతు.

Korrapadu: పొలంలో రోడ్డు.. వైసీపీ నాయకులే వేశారంటూ సీఎం జగన్‌కు రైతు రిక్వెస్ట్!

Anantapuram

Korrapadu: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కొర్రపాడు గ్రామంలో తమ పంట పొలాలను వైసీపీ నాయకులు నాశనం చేశారని ఆరోపించారు నాగలింగారెడ్డి అనే రైతు. సీఎం జగన్ తమను ఆదుకోవాలని వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు పంట పొలంలో రైతులపై దౌర్జన్యం చేస్తున్నట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

కొర్రపాడు పక్కన ఉన్న హైవేపై రైతు నాగలింగారెడ్డికి పొలం ఉండగా.. పక్కనే ఇటీవల శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి కుటుంబీకులు ఐదు ఎకరాల పొలం తీసుకున్నారు. ఆ పొలానికి వెళ్లడానికి వేరే దారి ఉన్నప్పటికీ ప్రధాన రహదారి నుంచి రోడ్డు వేసుకోవాలనేది వారి ఆలోచనగా బాధిత రైతు ఆరోపిస్తున్నారు.

దారి కోసం రైతు పచ్చటి వరి పైరును ట్రాక్టర్‎తో తొక్కించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేకున్నా తమ భూముల నుంచి రోడ్డు ఏర్పాటు వైసీపీ నాయకులు రోడ్డు వేయించుకున్నారని రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.