Kodali Nani : చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

రేపో ఎల్లుండో రేషన్ బియ్యంలో విషం ఉందని, త్రాగే నీటిలో విషం ఉందని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. టీడీపీలో బ్రోకర్లు అందరూ కలిసే ఈ బోగస్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali Nani : చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Kodali

Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర రాజకీయాలతో చంద్రబాబు ఒళ్లంతా కుళ్లిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్నమొన్నటి వరకూ మతాలు, కులాల మధ్య చిచ్చులు పెట్టారని ఆరోపించారు. తండ్రీకొడుకులు, దత్తపుత్రుడు ఎన్ని కుట్రలు చేసినా వర్క్ ఔట్ అవ్వడం లేదన్నారు. ఇప్పుడు తాజాగా మద్యం, మందులో విషం ఉందని మొదలెట్టారని పేర్కొన్నారు.

రేపో ఎల్లుండో రేషన్ బియ్యంలో విషం ఉందని, త్రాగే నీటిలో విషం ఉందని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. టీడీపీలో బ్రోకర్లు అందరూ కలిసే ఈ బోగస్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన విషం వాటిల్లో లేదు..చంద్రబాబు అండ్ కో బర్రల్లో ఉందని చెప్పారు. అరబిందో కంపెనీ మందుల్లో విషం ఉందని బోగస్ ప్రచారం మొదలు పెట్టారని వెల్లడించారు.

Nandikotkur : వైసీపీలో మరోసారి బయటపడిన విబేధాలు

అరబిందో ఫార్మా కంపెనీ 1985లో స్థాపించారు..ప్రపంచ వ్యాప్తంగా మందులు సరఫరా చేస్తుందన్నారు. అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.. ప్రమాణాలు పాటిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక ట్యాక్స్ కట్టే వాళ్ళలో అరబిందో ఒకటి అన్నారు.  అరబిందో జగన్ భినామి అనడానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు.

చంద్రబాబు, లోకేష్, పవన్, యెల్లో మీడియా ఎన్ని చేసినా జగన్ వెంట్రుక కూడా పికలేరన్నారు. తమిళనాడు, కేరళలో హెరిటేజ్ పాలని బ్యాన్ చేశారని పేర్కొన్నారు. చిన్న పిల్లలకి మెదడు, నరాల బలహీనత వస్తుందని అక్కడ బ్యాన్ చేశారని గుర్తుచేశారు. హెరిటేజ్ కి మించిన దౌర్భాగ్య కంపెనీ ఇంకొకటి లేదని విమర్శించారు. అక్కడ అమ్మేవి అన్ని కల్తీ సరుకులే..అందుకే వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.

Andhra pradesh : నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా..పార్టీ ఆదుకోవాలి : వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

క్రూయిజ్ విజయసాయిరెడ్డి కుమార్తెది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. క్రూయిజ్ లో క్యాసినో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫ్యామిలీస్ తో క్రూయిజ్ లో విహారయాత్రకి 700 మంది వెళ్తే అలాంటి మాటలు మాట్లాడోచ్చా.. అని నిలదీశారు. కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. టీడీపీ కల్తీ పార్టీ అని విమర్శించారు. ఎన్టీఆర్ కు వారసుడు కాకుండానే వారసుడు అని చెప్పుకుంటాడని పేర్కొన్నారు.