YCP MLA: పట్టాభిని సస్పెండ్ చెయ్యాలి.. జగన్‌కి క్షమాపణ చెప్పాలి -కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

YCP MLA: పట్టాభిని సస్పెండ్ చెయ్యాలి.. జగన్‌కి క్షమాపణ చెప్పాలి -కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy

YCP MLA: జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పట్టాభి వ్యాఖ్యలు అన్నీ చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు మాట్లాడించినవేనని అన్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడిన మాటలను చంద్రబాబు విన్నారు కదా? జగన్ గారిని అన్న మాటలే ప్రధానిపై, అమిత్ షాపై, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులపై మాట్లాడుతారా? అని ప్రశ్నించారు.

మిగిలిన రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలోని నాయకులపై కానీ మాట్లాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు.. పట్టాభి లాంటి వ్యక్తుల చేత తిట్టించడం వల్ల టీడీపీకే నష్టమని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పట్టాభి వ్యాఖ్యలతో చంద్రబాబుకి సంబంధం లేదని అనుకుంటే పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

పట్టాభిని సస్పెండ్ చేయకుంటే, ముఖ్యమంత్రి జగన్‌కి బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారని, గంజాయి అక్రమ రవాణాపై పక్కా ఆధారాలు చూపించాలన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.

ముఖ్యమంత్రి జగన్ ప్రజారాంజక పాలన కొనసాగిస్తున్నారని, ప్రజల్లో వస్తున్న ఆదరణ ఒర్వేలేకే టీడీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.