YES BANK ఆర్థిక సంక్షోభం : టీటీడీ ముందుచూపు
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన..బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి ఉపసంహరించుకుంది. YES BANK నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే గుర్తించారు. ఈ బ్యాంకులో ఉన్న రూ. 600 కోట్ల డిపాజిట్లను కొన్ని నెలల క్రిందటే ఉపసంహరించుకున్నారు. టీడీపీ హయంలో ఎస్ బ్యాంకుతో సహా 4 ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బులను టీటీడీ డిపాజిట్లు చేసింది.
టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత…డిపాజిట్లపై వైవీ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. నాలుగు బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉంది ? వాటి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశారు. సమాచారం కూడా తెప్పించుకున్నారు. ఎస్ బ్యాంకు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైవీ నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సీఎం సూచించారు. దీంతో వెంటనే అందులో ఉన్న డిపాజిట్లను రిటర్న్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రూ. 600 కోట్ల టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించుకుంది.
* RBI ఇప్పటికే YES BANK కు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది.
* డిపాజిట్ దారులు 50వేల రూపాయలకు మించి విత్ డ్రా చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.
* గతేడాది సెప్టెంబర్లో కంపెనీ మాజీ కీలక ఎగ్జిక్యూటివ్ తన వాటాలను విక్రయించారు. తర్వాత..డిపాజిట్ల ఉపసంహరణ భారీగా పెరిగిపోయిందని బ్లూమ్బర్గ్ ఓ కథనంలో పేర్కొంది.
ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్ కూడా భారీగా పడిపోతూ వచ్చింది.
* బ్యాంకు మొండి బాకీల ఆందోళనకు తోడు మూలధన సమీకరణలో ప్రతికూలతలను ఎదుర్కొంటుందని ఇండియా నివేష్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు రవికాంత్ ఆనంద్ భట్ గతంలో విశ్లేషించారు.
Read More : మహిళలు స్నానాలు చేస్తుంటే..రహస్యంగా చిత్రీకరించాడు..తర్వాత
See More :
* యస్ బ్యాంక్ లో నగదు ఉపసంహరణ పరిమితి రూ.50 వేలు