సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కాడు… విద్యుత్ తీగలు తగిలి మృతి

  • Published By: bheemraj ,Published On : June 2, 2020 / 08:59 PM IST
సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కాడు… విద్యుత్ తీగలు తగిలి మృతి

సెల్ఫీ మోజులో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీ కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ దిగే ప్రయత్నంలో ప్రమాదాలు జరుగడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో విషాదం నెలకొంది. 

సెల్ఫీ మోజులో పడి ప్రతాప్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్ద ఉండలేక స్నేహితులతో కలిసి సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కాడు. రైల్వే విద్యుత్ లైన్ హైవోల్టేజ్ సెల్ ఫోన్ కు ప్రవహించడంతో ప్రతాప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.