Vijayasai Reddy On Mahanadu : మహానాడు కాదు మహాప్రస్థానం- చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

మాధవరెడ్డిని చంద్రబాబు హత్య చేయించారు. మాధవరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకు కోపమో అందరికీ తెలుసు. కిక్ బాబు సేవ్ ఏపీ నినాదంతో వైసీపీ ముందుకెళ్తుంది.(Vijayasai Reddy On Mahanadu)

Vijayasai Reddy On Mahanadu : మహానాడు కాదు మహాప్రస్థానం- చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

Vijayasai Reddy On Mahanadu

Vijayasai Reddy On Mahanadu : టీడీపీ మహానాడు, చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అది మహానాడు కాదు మహాప్రస్థానం అని అన్నారు విజయసాయిరెడ్డి. వెన్నుపోటుదారుడు, ఉన్మాది అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. అంతేకాదు మాధవరెడ్డిని చంద్రబాబే హత్య చేయించారని సంచలన ఆరోపణలు చేశారు.

”వంచన, వెన్నుపోటుకు పుట్టిన వ్యక్తి చంద్రబాబు. మామను వెన్నుపోటు పొడిచిన ఉన్మాది చంద్రబాబు. ఉన్మాది చంద్రబాబు కొడుకే మరో సంవత్సరంలో తన కొడుకు లోకేష్ వెన్నుపోటు పొడుస్తాడు. లోకేష్ ను గుర్తింపు లేని వ్యక్తిగా చేసే పరిస్థితి చంద్రబాబు తెచ్చారు. మాధవరెడ్డిపై చంద్రబాబుకు కోపం ఉంటే ఉండొచ్చు. మాధవరెడ్డిని చంద్రబాబు హత్య చేయించారు. మాధవరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకు కోపమో అందరికీ తెలుసు.(Vijayasai Reddy On Mahanadu)

Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని

కిక్ బాబు సేవ్ ఏపీ నినాదంతో వైసీపీ ముందుకెళ్తుంది. మామను వెన్ను పోటు పొడిచి పార్టీని లాక్కుని ఎన్టీఆర్ కే సంవత్సరికంగా మహానాడు నిర్వహిస్తున్నారు. పనికి మాలిన వెధవలు రాష్ట్ర సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. నాసిరకం నాయకుడు అని చంద్రబాబు పేరులోనే ఉంది. చంద్రబాబు ఊహించుకుంటే ముందస్తు ఎన్నికలు వస్తాయా?

TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారు? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? 30వేల మంది కూడా మహానాడుకు రారు. ఉన్మాది పెట్టే మహా ప్రస్థానానికి ఎవరూ రారు. ఒక ట్రాన్స్ పోర్ట్ అధికారి సాయంతో జనాలను తరలిస్తున్నారు” అని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు.

మాజీమంత్రి కొడాలి నాని సైతం చంద్రబాబు, మహానాడుపై విరుచుకుపడ్డారు. టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కడతారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను నమ్మించడానికి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని నాని అన్నారు.

‘‘చంద్రబాబు ఆధ్వర్యంలో, 420ల సహాయంతో మహానాడు పేరుతో పండుగ చేస్తున్నారు. ఎప్పుడూ చెప్పే మాటలే చంద్రబాబు ఇప్పుడు కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. జగన్‌ను తరిమి కొట్టడం నీ తరం కాదు. కొట్టుకొచ్చిన పార్టీకి నాయకుడు చంద్రబాబు అయితే.. స్థాపించిన పార్టీకి నాయకుడు జగన్. అప్పట్లో చంద్రబాబు జామాత దశమ గ్రహం అనే ఆడియో క్యాసెట్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. జగన్ ఉన్మాది కాదు. చంద్రబాబు కంటే ఉన్మాది ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ అనే పేరు వింటే చంద్రబాబుకు నిద్రపట్టదు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు. ప్రతిపక్షానికి కూడా పనికిరావని 2019లో ప్రజలు 23 సీట్లే ఇచ్చారు. అమలాపురంలో మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టించావు” అని కొడాలి నాని ధ్వజమెత్తారు.

కాగా, మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పసుపు రంగు శుభాన్ని సూచిస్తుందని.. అటువంటి పాలనే తమ హయాంలో ప్రజలకు అందించామన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతా అరాచకమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ కూడా కనిపించట్లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ పాలనలో హింస పెరిగిపోయిందన్నారు. ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో ఈ మహానాడు జరుపుకుందామని చంద్రబాబు అన్నారు.