జగనన్న తోడు..సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు..ఎవరు అర్హులు

పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్…మరో పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధిక వడ్డీలతో సతమతమౌతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేవలం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ నెలలో బ్యాంకు రుణాలిప్పించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. రూ. 10 వేల చొప్పున రుణాలు ఇప్పించి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో టీ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లపై టిఫిన్ విక్రయాలు తదితర చిరు వ్యాపారాలకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరందరికీ…గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈ నెల 18వ తేదీ వరకు సర్వే నిర్వహించి 30వ తేదీకల్లా అర్హులను గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
* చిరు వ్యాపారి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.
* ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి.
* రోడ్డు పక్కన, ఫుట్పాత్లపై, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, తలపై గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు అర్హులు.
* ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్ సైకిళ్లు, ఆటోలపై తిరుగుతూ వ్యాపారం చేసుకునే వారు కూడా అర్హులే.
* గ్రామాల్లో, పట్టణాల్లోనైనా సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.
- Andhra Pradesh : కొత్త మంత్రుల జాబితా రెడీ ?..ఎల్లుండి ప్రమాణ స్వీకారం
- Ap cm jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ.. కేంద్ర మంత్రులను కలవనున్న జగన్
- Nara Lokesh : ఇక ప్రజాక్షేత్రంలోకి టీడీపీ నేతలు.. ముహుర్తం ఫిక్స్
- PAN-Aadhaar Linking : 31 లాస్ట్ డేట్.. ఆ తర్వాత రూ.10 వేలు జరిమానా..!
- Meena Jewelers : హైదరాబాద్ మీనా జ్యువెలర్స్ పై మూడు సీబీఐ కేసులు నమోదు
1CM KCR On Education : తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యా విధానం అమలు చేస్తాం-కేసీఆర్
2bride-groom fire gunshots: పెళ్లిలో తుపాకి పేల్చిన కొత్త జంట.. కేసు నమోదు
3Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
4Upcoming Movies: జులై నుండి కౌంట్డౌన్ స్టార్ట్.. పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్స్!
5Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్
6Biden Offer Kim : నార్త్ కొరియాకు బైడెన్ ఆఫర్.. కిమ్ నిజాయితీగా ఉంటే కలిసేందుకు రెడీ..!
7Ex Minister Vs MLA: నాగర్కర్నూల్లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
8Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష
9KCR Delhi Tour : ఢిల్లీలో కేసీఆర్.. మొహల్లా క్లినిక్, సర్వోదయ స్కూల్ సందర్శన
10Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
-
ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్డ్రా చేయొచ్చు!
-
Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
-
CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
-
Lightning Strikes: బీహార్లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
-
Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు