Home » ఏపీలో మరో కొత్త స్కీమ్.. సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం
Published
3 days agoon
social welfare schemes calendar: ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రకటించింది. 23 పథకాలకు నెలవారీ షెడ్యూల్ ను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విడుదల చేశారు. మొత్తం 23 పథకాలను నెలవారీగా అమలు చేయనున్నారు. ఈ ఏడాది(2021) ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది(2022) జనవరి వరకు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒకటికి మించి పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల్లో 8 నుంచి 12 కోట్ల మంది లబ్ధిదారులున్నట్లు వెల్లడించారు. కాగా, ఈసారి కొత్తగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఏప్రిల్ 2020: జగనన్న వసతి దీవెన పథకం కింద 15లక్షల మందికి పైగా విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీల చెల్లింపు
ఏప్రిల్ 2021: జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగు విడతలుగా ( ఏప్రిల్-జులై-డిసెంబర్-ఫిబ్రవరి) సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు. 18లక్షల 80వేల మందికి లబ్ధి.
ఏప్రిల్ 2021: రైతులకు వడ్డీ లేని రుణాలు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 66.11 లక్షల మందికి వడ్డీలేని రుణాలు
ఏప్రిల్ 2021: 90.37లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
మే 2021: పంటల బీమా కింద రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రైతులకు బీమా చెల్లింపు
మే 2021: రైతు భరోసా పథకం కింద మూడు దఫాలుగా (మే-అక్టోబర్-జనవరి) 54 లక్షల మందికి రైతులకు లబ్ధి
మే 2021: మత్స్యకార భరోసా కింద 1.09 లక్షల మందికి ఆర్ధిక సాయం
మే 2021: మత్స్యకార భరోసా పథకం కింద 19వేల పడవలకు డీజిల్ సబ్సిడీ
జూన్ 2021: జగనన్న విద్యాకానుక పథకం కింద 42లక్షల మందికి బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ
జూన్ 2021: వైఎస్ఆర్ చేయూత పథకం కింద 24 లక్షల మందికి రూ.17,250 చొప్పున ఆర్ధిక సాయం
జూలై 2021: వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పథకం కింద 2 లక్షల మందికి రూ.10వేల చొప్పున ఆర్ధిక సాయం
జూలై 2021: వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 3.27లక్షల మందికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం
ఆగస్టు 2021: 25 లక్షల మంది రైతులకు వడ్డీలేని రుణాలు
ఆగస్టు 2021: 9వేల ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు
ఆగస్టు 2021: నేతన్న నేస్తం పథకం కింద 81వేల మందికి ఆర్ధిక సాయం
ఆగస్టు 2021: 3లక్షల 34వేల మంది మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు
సెప్టెంబర్ 2021: వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 87లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెల్లింపులు
అక్టోబర్ 2021: జగనన్న తోడు పథకం కింద 9.05లక్షల మందికి సాయం
అక్టోబర్ 2021: జగనన్న చేదోడు పథకం కింద టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆర్ధిక సాయం.. 2.95లక్షల మందికి లబ్ధి
నవంబర్ 2021: అగ్రవర్ణాల పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకం కింద రూ.15వేలు ఆర్ధిక సాయం. 6 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా
జనవరి 2022: జగనన్న అమ్మఒడి పథకం కింద 44లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం.
ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..
ప్రభుత్వ పాఠశాలల్లో CBSE సిలబస్, సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం
హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మరో షాక్
ఒక్కొక్కరికి రూ.45 వేలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పై అసెంబ్లీలో తీర్మానం.. కేబినెట్ కీలక నిర్ణయాలు
వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త
మా సైనికులు కరోనానే లెక్క చెయ్యలేదు, జగన్ ఓ లెక్కా..