పరమశివుడిని చూపిస్తా రండి అంటున్న నిత్యానంద

పరమశివుడిని చూపిస్తా రండి అంటున్న నిత్యానంద

come my country – nithyananda : టు నైట్స్ త్రీ డేస్ వచ్చే వాళ్లను తీసుకెళుతా. ఒక్క పైసా తీయవద్దు..హ్యాపీగా చార్టెడ్ ఫ్లైట్‌లో జర్నీ చేయవచ్చు. ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చూసుకుంటాం. జస్ట్ మీరు వీసా కోసం అప్లై చేసుకోండి. మిగతా అంతా మేమే చూసుకుంటాం అంటున్నారు. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఇదేదో ఏ కంపెనీ ఆఫర్ ఇచ్చింది అనుకుంటున్నారా ? అదేమి కాదు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, భారతదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆధ్యాత్మిక విహార యాత్రలో ఆ మూడు రోజులు ఎక్కడకు తీసుకెళుతాడు ? అనేగా మీ డౌట్. కైలాశానికి తీసుకెళ్లి..అక్కడ శివుడిని చూపిస్తానని హామీనిస్తున్నాడు ఇతను.

గతంలో కైలాశ ద్వీపం పేరిట..ఓ కొత్త దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా…ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సొంత ఖర్చులతో ఆస్ట్రేలియా వరకు చేరుకోవాలని ఓ కండీషన్ పెట్టాడు. అక్కడి నుంచి అంతా..తామే చూసుకుంటామంటున్నారు. మూడు రోజులకంటే ఎక్కువ రోజులు ఉండడం కుదరదని వెల్లడించారు. కైలాస యాత్ర కోసం చార్టెడ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. కైలాస వీసా కోసం మీరు ఈ మెయిల్స్ పంపడం మొదలు పెట్టండి అంటు పిలుపునిచ్చారాయన.

రేప్ కేసులో నిందితుడైన నిత్యానంద స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్, కర్ణాటకలలో అత్యాచారం, అపహరణ కేసులు నమోదైవడంతో గతేడాది దొంగ పాస్ పోర్ట్ తో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి నిత్యానందను పట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో పరారీలో ఉన్న స్వామి నిత్యానందకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.
నిత్యానంద తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు. నిత్యానందపై బెంగళూరుకు చెందిన జనార్దన్‌ శర్మ గుజరాత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పట్లో. శర్మ తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్‌ చేసి అహ్మదాబాద్‌ ఆశ్రమంలో నిర్బంధించారంటూ చేసిన ఫిర్యాదుతో నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. ఓ ప్రాంతానికి వెళ్లి..తనది సొంత కైలాశ దేశంగా ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన యూ ట్యూబ్ ద్వారా వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. వినాయక చవితి నాడు..ఆ దేశ కరెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. హిందూ దేశాలతో తాను వ్యాపారం చేయనున్నట్లు ప్రకటించారు.