వినాయక చవితి..ముందురోజు గౌరీపూజ

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 03:15 PM IST
వినాయక చవితి..ముందురోజు గౌరీపూజ

శక్తికి మూలం దేవత. మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్ , గౌరీ చౌత్ లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా దీనిని జరుపుకుంటారు.



ఈ పండుగ వివాహిత మహిళలకు అంకితం చేయబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం, గౌరీ పండుగను భాద్రపద శుద్ద చతుర్థి  ముందు రోజు తృతీయ రోజున జరుపుకుంటారు.గణేశ చతుర్థి పండుగ పర్వదినాలు ప్రారంభమవుతాయి.

సౌభాగ్యాలను ప్రసాధించే గౌరీ పండుగను వివాహిత మహిళలు జరుపుకుంటారు. గౌరీ దేవిని ఆరాధించడం వల్ల సుఖ, సంతోషాలతో పాటు ఆనందం, సంపద మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుందని మరియు తన భర్తను ఆయుష్యును పెంచి ఆశీర్వదిస్తుందని అంటారు. గౌరీ పండుగ వరమహాలక్ష్మి వ్రత మాదిరిగానే ఉంటుంది. తేడా ఏమిటంటే లక్ష్మీ స్థానంలో గౌరీ దేవిని పూజిస్తారు.

గౌరీ – గణేశ

గౌరీ దేవి / పార్వతీ దేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయంతో గణేషుడిని సృష్టించి ఆ రోజును గణేశుని పుట్టినరోజుగా భావించారు. ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని పిలువబడుతోంది.



గణేశ చతుర్థి
సిరి సంపదలు సమృద్ధిగా, జ్ఞానం, గొప్పతనం, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించేది గణేశుడు. హిందూ పంచాగం ప్రకారం పండుగ భాద్రపద మాసంలో వస్తుంది. అన్నివేళలా కరుణ కలిగి ఎల్లప్పుడు ఆశీస్సులను ప్రసాధించే గణేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు చతుర్థిని జరుపుకుంటారు.

ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం ఒక రోజు, మూడు రోజులు, ఏడు రోజులు, పది రోజులు జరుపుకుంటారు. కొంతమంది గౌరీ, గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు, మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తారు.

పశ్చిమ బెంగాల్‌లో లక్ష్మీ, సరస్వతిని గణేశుడులను సోదరీ మణులుగా పూజిస్తారు. వారు దుర్గాదేవి పిల్లలుగా భావిస్తారు. కొందరు లక్ష్మీ, సరస్వతి గణేశుల ఇద్దరు భార్యలు. సిద్ధి, బుద్ధి. ఇది తరచుగా అనేక అపోహలకు కారణమని చెప్పవచ్చు. ఈ కారణాలన్నింటికీ ఈ పండుగను గౌరీ గణేష పండుగగా పిలువబడుతున్నది.



పురాణం గాథ
పురాణాల ప్రకారం, ఒక రోజు శివుడి నివాసమైన కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు, ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతి దేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చొండి బెట్టి స్నానానికి వెల్లాని అనుకుంటుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడింది.

అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది. విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతోనే ఆ విగ్రహమూర్తికి గణేశ అని పేరు పెట్టింది. తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించింది. ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను. ఎవరినీ లోపలికి రానివ్వకండి అని చెబుతుంది.



అంగీకరించిన గణేష్ ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడుతాడు. అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు. లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్ళడానికి అనుమంతించకుండా ఆపుతాడు.

శివుడు పార్వతి దేవి పతిదేవుడనే విషయం గణేశుడికి, గణేశుడు పార్వతి దేవి సృష్టించి కుమారుడని శివుడికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు జరుగుతాయి. ప్రవేశ ద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేశుడిపై ఆ పరమేశ్వరుడు ఆగ్రహావేశాలకు గురయ్యై అతడి తలను నరికివేస్తాడు.



బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ
బాలుని హాహాకారాలు విన్న పార్వతీ దేవీ పరుగున వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూచి నిశ్చేష్టురాలైంది. భర్తతో వాదులాడింది. జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపపడ్డాడు. బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు.

భటులు ఉత్తర దిక్కున్న పడుకున్న వ్యక్తి తల కోసం వేతుకుతారు. అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. శివ శిశువు మీద ఏనుగు తలను స్థిరపెట్టి, అతనికి తిరిగి జీవం పోస్తాడు.



గౌరీ చతుర్థి ఆచారం
మహిళలు చతుర్థికి ముందు రోజు ఈ దేవిని పూజించడం ఆచారంగా వస్తోంది. అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచడం జరగుతుంది. పూలు, పండ్లు సమర్పించి పూజిస్తారు. మరుసటి రోజు గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.