కరోనాలో కొత్త మార్పులు : ‘మింక్’ల నుంచి మనుషులకు వ్యాప్తి..వ్యాక్సిన్లు పనిచేయవంటూ సైంటిస్టుల ఆందోళన

  • Published By: nagamani ,Published On : November 7, 2020 / 11:47 AM IST
కరోనాలో కొత్త మార్పులు : ‘మింక్’ల నుంచి మనుషులకు వ్యాప్తి..వ్యాక్సిన్లు పనిచేయవంటూ సైంటిస్టుల ఆందోళన

Denmark  mink related coronavirus : కరోనా మహమ్మారిని మాయలమారిగా మారి జనాలను పట్టి పీడిస్తోంది. కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి అన్నట్లుగా ఏకంగా సైంటిస్టుల్లే ఆశ్చర్యాలకు గురిచేస్తోంది. పలు రకాలుగా మారిపోతూ పరిశోధకులకు సైతం చుక్కలు చూపిస్తోంది. సంవత్సరం నుంచి కరోనా వైరస్ పై పరిశోధనలు చేస్తుంటే కొత్త కొత్త విధాలుగా మారిపోతూ తికమకపెట్టేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి కలవరపరుస్తోంది.యూకేలోని డెన్మార్క్‌లో మింక్ అనే జీవి ద్వారా కొత్త రకం కరోనా వైరస్ మనుషులకు వైరస్ వ్యాపిస్టున్నట్లుగా సైంటిస్టులు గుర్తించారు.దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ రోజురోజుకు కొత్త కొత్తగా మారుతుండటంతో పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.



దీని పరివర్తనపై ఆందోళనచెందుతున్న సైంటిస్టులు తాజాగా మరో హెచ్చరిక చేశారు. కరోనా వైరస్‌లో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయని..ఈ మార్పు తర్వాత వైరస్ కనుక విస్తృతంగా వ్యాపిస్తే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు కూడా ఎందుకూ పనికిరాకుండాపోతాయని హెచ్చరిస్తున్నారు.


డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్టు స్టేటెన్స్ సీరమ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం వందల కొద్దీ మింక్ ఫారాలు ఉన్న జూట్‌ల్యాండ్‌లో ఆంక్షలు విధించింది. అలాగే, ఉత్తర డెన్మార్క్‌లో నేటి నుంచి కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టి ఫ్రెడ్రెక్సన్ తెలిపారు. అక్కడ నివసించేవారు ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని, దీనిని ఉల్లంఘిస్తే కనుక వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


డెన్మార్క్ లోని జూట్‌ల్యాండ్ ప్రాంతంలో దాదాపు 1,100 పెంపుడు కేంద్రాల్లో 1.7 కోట్ల మింక్‌లను పెంచుతున్నారు. 207 కేంద్రాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించారు. వీటి వల్ల మొత్తం మింక్‌లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు మింక్ కేంద్రాల్లో 12 మంది ఈ కొత్తరకం వైరస్ బారినపడ్డారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 214 మందికి ఇది సోకింది.


వందల కొద్ద ఫారమ్‌ల్లో మింక్‌లను పెంచుతున్న ఉత్తర జూట్‌ల్యాండ్‌ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో జనం ఎవరూ బహిరంగ ప్రదేశాల్లోకి రావద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.