కరోనా వ్యాక్సిన్…ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్న బిల్ గేట్స్
ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్.. కరోనా వైరస్ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అయన తెలిపారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్టచారింగ్ లో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఒకసారి వ్యాక్సిన్ బయటకువచ్చాక.. దానిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు ప్రపంచ దేశాలు భారత్వైపు చూస్తున్నాయని బిల్గేట్స్ తెలిపారు.
https://10tv.in/nagpur-face-mask-violation-fine-up-from-rs-200-to-rs-500-minister/
ఓ ఇంటర్వ్యూ లో బిల్ గేట్స్ మాట్లాడుతూ…వచ్చే ఏడాదిలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నాం. అది సమర్థంగా పనిచేస్తుంది, భద్రంగా ఉందని తెలిసిన వెంటనే.. ప్రపంచ దేశాల చూపు భారత్వైపు మళ్లుతుంది. వీలనైంత తక్కువ సమయంలో భారత్.. టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందిస్తుందని ఆశిస్తున్నాం. భారీ స్థాయిలో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసి… దానిని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్న భారత్ సంకల్పం ఇందుకు తోడ్పడుతుందన్నారు. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, బయో-ఈ వంటి భారత సంస్థలను ప్రస్తావించారు బిల్ గేట్స్. వీటి సామర్థ్యంతో వ్యాక్సిన్ తయారీ సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ ను తీసుకుని భారత్లో ఉత్పత్తి చేయాలన్న ఆలోచన మాకు ఉంది. అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి వచ్చిన టీకాను భారత్ కు అప్పగిచాలని అలోచిస్తున్నాం. వీటికి సంబంధించి భారీ డోసులను సీరం ఉత్పత్తి చేసే విషయంపై మాట్లాడుకున్నాం. బయో-ఈతోనూ చర్చలు జరుగుతున్నాయని బిల్ గేట్స్ అన్నారు.
కాగా, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్గేట్స్ .. కరోనాపై పోరాటానికి మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.