కరోనా వ్యాక్సిన్…ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్న బిల్ గేట్స్

  • Published By: venkaiahnaidu ,Published On : September 15, 2020 / 04:12 PM IST
కరోనా వ్యాక్సిన్…ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్న బిల్ గేట్స్

ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్.. కరోనా వైరస్​ అని ​ మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్​ కీలక పాత్ర పోషిస్తుందని అయన తెలిపారు.

కరోనా వైరస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్టచారింగ్ లో భారత్​ ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఒకసారి వ్యాక్సిన్​ బయటకువచ్చాక.. దానిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు ప్రపంచ దేశాలు భారత్​వైపు చూస్తున్నాయని బిల్​గేట్స్​ తెలిపారు.



https://10tv.in/nagpur-face-mask-violation-fine-up-from-rs-200-to-rs-500-minister/
ఓ ఇంటర్వ్యూ లో బిల్ గేట్స్ మాట్లాడుతూ…వచ్చే ఏడాదిలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నాం. అది సమర్థంగా పనిచేస్తుంది, భద్రంగా ఉందని తెలిసిన వెంటనే.. ప్రపంచ దేశాల చూపు భారత్​వైపు మళ్లుతుంది. వీలనైంత తక్కువ సమయంలో భారత్​.. టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందిస్తుందని ఆశిస్తున్నాం. భారీ స్థాయిలో వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేసి… దానిని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్న భారత్​ సంకల్పం ఇందుకు తోడ్పడుతుందన్నారు. సీరం ఇన్​స్టిట్యూట్​, భారత్​ బయోటెక్, బయో-ఈ​ వంటి భారత సంస్థలను ప్రస్తావించారు బిల్​ గేట్స్​. వీటి సామర్థ్యంతో వ్యాక్సిన్​ తయారీ సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.


వ్యాక్సిన్​ ను తీసుకుని భారత్​లో ఉత్పత్తి చేయాలన్న ఆలోచన మాకు ఉంది. అస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​, జాన్సన్​ అండ్​ జాన్సన్​ నుంచి వచ్చిన టీకాను భారత్​ కు అప్పగిచాలని అలోచిస్తున్నాం. వీటికి సంబంధించి భారీ డోసులను సీరం ఉత్పత్తి చేసే విషయంపై మాట్లాడుకున్నాం. బయో-ఈతోనూ చర్చలు జరుగుతున్నాయని బిల్ గేట్స్ అన్నారు.

కాగా, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా బిల్‌గేట్స్ .. కరోనాపై పోరాటానికి మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.