కొత్త హంగులతో ఇండియాకు పబ్‌జీ.. ప్రీ-రిజిస్ట్రేషన్ మొదలైందోచ్..!

  • Published By: sreehari ,Published On : November 14, 2020 / 09:55 PM IST
కొత్త హంగులతో ఇండియాకు పబ్‌జీ.. ప్రీ-రిజిస్ట్రేషన్ మొదలైందోచ్..!

Pubg-mobile

Pubg mobile Pre-registrations start: మొబైల్‌ గేమ్‌ లవర్స్‌కి శుభవార్త… ఇండియాలో హయ్యెస్ట్‌ ఫ్యాన్‌బేస్‌ ఉన్న పబ్‌‌జీ మళ్లీ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. కొత్త వెర్షన్‌ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్ కూడా మొదలయ్యింది.



చైనాతో సరిహద్దు వివాదం కారణంగా కేంద్ర ప్రభుత్వం పబ్‌‌జీని సెప్టెంబరులో నిషేధించింది. పబ్‌‌జీ‌ని ప్రమోట్‌ చేస్తున్న టెన్సంట్‌ కంపెనీ చైనాకు చెందినది కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌లో ఎలాగైనా అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్న పబ్‌‌జీ మాతృసంస్థ క్రాఫ్టన్‌… తగు చర్యలు తీసుకుంది.

టెన్సంట్‌‌తో తెగతెంపులు చేసుకుంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌కి చెందిన అజ్యూర్‌ క్లౌడ్‌ సర్వీస్‌తో ఒప్పందం చేసుకుంది. చైనాతో సంబంధాలు తెంచుకోవడంతో పబ్‌జీ‌కి కేంద్రం అనుమతి ఇచ్చింది.



కేంద్రం నుంచి అనుమతులు రావడంతో ఆండ్రాయిడ్‌, యాపిల్‌ వెర్షన్‌లకు తగ్గట్టుగా గేమ్‌ని కొత్తగా తీసుకు రాబోతుంది. పాత వెర్షన్‌కి అనేక హంగులు జోడించింది. టైమ్‌ లిమిట్‌, హిట్టింగ్‌ ఎఫెక్ట్స్‌లో ఈ మార్పులు ఉండబోతున్నాయి.



ఈ మేరకు కమింగ్ సూన్‌ అంటూ ఫేస్‌బుక్‌లో ఉన్న పబ్‌జీ మొబైల్‌ ఇండియా వాల్‌‌పై పేర్కొంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ని పోస్ట్‌ చేసింది. ఇలా పబ్‌‌జీ నుంచి ప్రకటన వచ్చిందో లేదో వేల సంఖ్యలో గేమ్‌ కోసం రిజిష్ట్రేషన్లు మొదలైపోయాయి.



గత రెండేళ్లుగా మొబైల్‌ గేమ్‌ లవర్స్‌ని ఉర్రూతలూగించిన గేమ్‌ పబ్‌‌జీ. చైనా‌కు చెందిన టాన్సెంట్‌ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న ఈ గేమ్‌ ఇండియాలో సూపర్ సక్సెస్‌ అయ్యింది. లేటెస్ట్‌ వెపన్స్‌తో.. ఫ్రెండ్స్‌ అంతా కలిసి టీములుగా ఏర్పడి ఆన్లైన్‌లో గేమ్‌ ఆడే అవకాశం ఉన్న పబ్‌జీకి యువత పట్టం కట్టింది.



పల్లె, పట్నం తేడా లేకుండా లక్షల కొద్ది ఈ గేమ్‌ని ఇష్టపడ్డారు. పబ్‌‌జీ గేమ్‌ అడేందుకు ప్రత్యేకంగా మొబైళ్లు కొనుక్కున్న వారూ ఉన్నారు. అంతేకాదు పబ్‌‌జీ గేమ్స్‌పై బెట్టింగ్‌లు కూడా నిర్వహించే వారంటే ఈ గేమ్‌కి ఉన్న క్రేజ్‌ ఏంటో తెలుస్తుంది. భారత్ చైనా ఘర్షణల కారణంగా ఇండియా మార్కెట్‌ నుంచి దూరమైన పబ్‌‌జీ… ఇప్పుడు కొత్తరూపంలో వస్తోంది.