కోవిడ్ గురించి ICU డాక్టర్లు చెబుతున్న 10 ముఖ్యమైన విషయాలు..

  • Published By: sreehari ,Published On : August 3, 2020 / 01:35 PM IST
కోవిడ్ గురించి ICU డాక్టర్లు చెబుతున్న 10 ముఖ్యమైన విషయాలు..

ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఏ చిన్న జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా వామ్మో.. కరోనా అంటూ తెగ భయపడిపోతున్నారు. ఏది సాధారణ ఫ్లూ.. ఏది కరోనా ఫ్లూ తెలియక గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి కరోనా లక్షణాలు.. సాధారణ ఫ్లూ లక్షణాలు ఒకేలా పోలి ఉండటంతో ఈ కన్ఫూజన్ ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోంది.

ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వారిలో శ్వాస కోశ సమస్యలు అధికంగా ఉంటాయి. శ్వాస తీసుకోలేని వారికి తప్పనిసరిగా వెంటిలేషన్ అవసరం అవుతుంది.. వెంటనే ఐసీయూలోకి తరలించి చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది.. ఇలా కరోనా తీవ్ర లక్షణాలతో ఐసీయూలో చేరిన రోగుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు, లక్షణాలు ఉంటాయో ఐసీయూలో పనిచేసిన స్పెషలిస్ట్ డాక్టర్లు 10 ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.



కరోనా వైరస్ సోకిన బాధితుల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి.. కరోనా సోకినప్పటి నుంచి వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులు ఐసీయూలో చేరినప్పుడు వారిలో ఎలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయో పల్మనరీ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ Mike Hansen ఒక్కొక్కటిగా వివరించారు.

This ICU Doctor Shared the 10 Most Important Things He Learned Treating COVID Patients

దీనికి సంబంధించి యూట్యూబ్ వీడియోలో వివరంగా తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో గత కొన్ని నెలలుగా ఐసియు రోగులకు చికిత్స అందించానని చెప్పారు. ఆ సమయంలో కరోనా రోగుల్లో తాను గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేశారు.. అవేంటో ఓసారి లుక్కేయండి..



1. లక్షణాలు :
కరోనా రోగుల్లో ఎక్కువగా కనిపించిన అత్యంత సాధారణ లక్షణాల్లో జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోలేకపోవడం, కండరాల నొప్పులు. రుచి, వాసన కోల్పోవడం, వికారం లేదా విరేచనాలు వంటి ఇతర లక్షణాలు ఐసీయూలో ఉన్న కరోనా రోగుల్లో కనిపించలేదని అన్నారు.

2. తక్కువ స్థాయిలో విటమిన్ D :
ఆస్పత్రిలో చేరిన చాలా మంది COVID రోగులకు తక్కువ విటమిన్ D స్థాయిలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ప్రతి COVID రోగికి తప్పనిసరిగా విటమిన్ డి పెద్ద మోతాదులో ఇవ్వాలని ఆయన సూచించారు.

3. వైరస్ ప్రాణాంతక అంటువ్యాధి :
కరోనా వైరస్ ప్రాణాంతక అంటువ్యాధిగా భయపడిపోతుంటారు.. ICU వంటి భద్రతతో కూడిన వాతావరణంలో కూడా COVID వైరస్ సోకే ప్రమాదం ఉందన్నారు. ఐసియులో ఉన్న ఒక రోగిని హాన్సెన్ గురించి చెప్పుకొచ్చాడు. అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్టు గమనించాడు.. ఊపిరితిత్తులలో మంటగా ఉందని చెప్పినట్టు తెలిపాడు. COVID పాజిటివ్ అని తేలింది.. కానీ, వారికి ICUలో వైరస్ ఎంతవరకు వచ్చిందో అస్పష్టంగా ఉంది. సాధారణంగా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ లోడ్ ఎక్కువగా ఉంటుందని ఆయన చెబుతున్నారు.



4. ఎవరు లేక.. ఒంటరిగానే కరోనా పేషెంట్లు :
ఆస్పత్రుల్లో పేషెంట్లను చూసేందుకు వచ్చేవారికి పరిమితంగానే అనుమతి ఉంటుంది.. అందులోనూ కరోనా సోకినవారంటే అసలే ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి ఉండదు.. ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చినా ఐసీయూలోకి ఎవరిని అనుమతించరు.. అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి.. ఇది రోగులకు, వారి కుటంబ సభ్యులకు చాలా కష్టమైనదని, ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తాను చూసానని హాన్సెన్ తెలిపారు. ఎవరూ రాక.. ఐసీయూలోని కొందరు పేషెంట్లు ఒంటరిగానే చనిపోతున్నారని ఆయన చెప్పారు.

5. చికిత్సలు :
కరోనాకు ఇప్పటివరకూ ఎలాంటి చికిత్స లేదు.. మందు కూడా లేదు.. కేవలం మరో వ్యాధికి పనిచేసే డ్రగ్స్ ద్వారానే కరోనాకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.. ఒక డ్రగ్ పనిచేయకపోతే మరో డ్రగ్ కాంబినేషన్ తో కరోనా చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తిని ప్రాథమిక చికిత్సతో మొదలు పెట్టి వారిలో లక్షణాలు, వైరస్ తీవ్రత బట్టి చికిత్స అందిస్తున్నారు. కరోనా చికిత్స ఎక్కువగా వాడే డ్రగ్స్ ల్లో remdesivir, convalescent plasma, dexamethasone డ్రగ్స్ తోపాటు రక్తం పలచబడానికి చికిత్సా మోతాదులను కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు.



6. టెస్టింగ్ :
కరోనా సమయంలో టెస్టుల ఫలితాలను ఊహించడం కష్టమని హాన్సెన్ వివరించాడు. మూడు వారాల వ్యవధిలో రెండు వేర్వేరు సందర్భాలలో COVIDకి పాజిటివ్ అని తేలింది.. ఆ రోగిని ఉదాహరణగా చెప్పాడు.. PCR టెస్టు వేరు చేసిన వైరల్ RNAను ఎంచుకుంటుంది. ఈ అవశేషాలు పరీక్షలో పాజిటివ్ రావడానికి కారణం అవుతున్నాయి. అయినప్పటికీ వారిలో వైరస్ వ్యాప్తి చెందకపోయే అవకాశం ఉంటున్నారు.

7. ఊబకాయం :
COVID రోగుల్లో చాలా మందిలో ఊబకాయం లేదా అధిక బరువు కలిగి ఉన్నారని హాన్సెన్ చెప్పారు. ఊబకాయం ఉన్న చాలా మందికి స్లీప్ అప్నియా (sleep apnea) లేదా ఊబకాయం హైపర్‌వెంటిలేషన్ సిండ్రోమ్ ఉందని చెప్పాడు. అందుకే దీని కారణంగా కరోనా రోగుల్లో చాలామంది కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోలేరని తెలిపారు.

8. మెకానికల్ వెంటిలేషన్ :
వెంటిలేషన్ పెట్టాలని నిర్ణయించుకునే ముందు, ఒకరి ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని అర్థం.. ఎవరైనా శ్వాసకోశ బాధలో ఉన్నప్పుడు నిర్ణయం సులభం అవుతుంది. రోగి ఇంట్యూబేట్ అయిన తర్వాత, వెంటిలేటర్‌లోని సెట్టింగులు ఉంటాయి. ఆ రోగికి అనుగుణంగా ఉండాలి. సాధారణంగా ఇంట్యూబేటెడ్ రోగులకు నిజం అయితే వారి ఊపిరితిత్తుల వ్యాధి వివిధ సామర్థ్యం కారణంగా COVIDతో మరింత ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రోగులకు ఎక్కువ మంట లేదా ఎక్కువ రక్తం గడ్డకట్టవచ్చు. చాలా కారకాల ఇది ఒక పరిమాణం అన్నింటికీ సరిపోదు.



9. రికవరీ :
పల్మనరీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఐసియు డాక్టర్‌గా హాన్సెన్ కరోనా రోగులను కోలుకోవడానికి అవసరమైన చికిత్స అందించినట్టు తెలిపారు. కొంతమంది రోగుల్లో ఊపిరితిత్తుల పనితీరుకు శాశ్వత నష్టం ఉందని అన్నారు. కాని ఇతర సందర్భాల్లో, ఆ నష్టం కాలక్రమేణా నెమ్మదిగా నయం అవుతుందని ఆయన చెప్పారు.

10. వైరస్ ఎవరికి సోకుతుందో ఊహించలేం :
కరోనా వైరస్ ఎవరికి సోకుతుంది.. ఎవరు అనారోగ్యానికి గురవుతారు.. ఎవరిలో లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు.. వ్యాధి తీవ్రతలో వైవిధ్యం, ఎవరైనా బాగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా వెంటిలేషన్ అవసరం పడుతుందని చెప్పారు. కొంతమందికి ఎలా ఎక్కువ ఛాతిలో మంట వస్తుంది.. మరికొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉంటాయి.. కొంతమంది ఇతరులకన్నా వేగంగా కోలుకుంటారు..

మనమందరం ఇంకా ఈ వైరస్ గురించి నేర్చుకోవాల్సి ఉందని హాన్సెన్ చెప్పారు. యాంటీబాడీస్ ఎంతకాలం రక్షణగా ఉంటాయో మనకు ఇంకా తెలియదన్నారు. వ్యాక్సిన్ మాత్రమే వైరస్ నుంచి దీర్ఘకాలం రక్షించలేదన్నారు. కొన్ని వైద్య పరీక్షలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.. ప్రస్తుతం అందరూ సామాజిక దూరాన్ని కొనసాగించడం, మాస్క్ లు ధరించడం తప్ప మరో మార్గమే లేదన్నారు.