అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్ దే…న్యాయపోరాటానికి సిద్దమైన ట్రంప్
Joe Biden at 264 electoral votes అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ దూసుకెళ్తున్నారు. హోరాహోరీగా సాగుతోన్న అధ్యక్ష ఎన్నికల్లో శ్వేతసౌధానికి ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్ ఉన్నారు. అధ్యక్ష పీఠం సాధించేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లకు గాను బైడెన్ 264 ఓట్లు సాధించారు. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా,మిచిగావ్,విస్కాన్సిస్,న్యూయార్క్ వంటి రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకొని…అధ్యక్ష పదవికి చేపట్టేందుకు బైడెన్ సిద్దమయ్యారు.
ఇక,రిపబ్లిక్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేైసిన డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ న్యాయపోరాటానికి దిగారు. బైడెన్ గెలుపొందిన విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను పునర్లెక్కించాలని ట్రంప్ బృందం కోరనుంది. ఇక్కడ ఇరువురి మధ్య పోరు హోరాహోరిగా సాగింది. 2016లో కూడా ఈ రాష్ట్రంలో ట్రంప్ ఒక పాయింట్ కన్నా తక్కువ మార్జిన్లో ఓడిపోయారు.
https://10tv.in/keep-the-faith-guys-we-are-going-to-win-this-joe-biden/
కాగా, అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ వేళ శ్వేతసౌధం బయట నిరసనలు జరుగుతున్నాయి. ట్రంప్, బైడెన్ మద్దతుదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు