బిగ్బాస్లో ఫేక్ ఎలిమినేషన్… లాస్య అంతా అయోమయం, గంగవ్వ ఫైనలిస్ట్ కాదట!!
బిగ్బాస్ షోలో ఫేక్ ఎలిమినేషన్. గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ ఫేక్ ఎలిమినేట్ అయితే ఈ సారి దేత్తడి హారిక ఫేక్ ఎలిమినేట్ అయింది. అయితే ఈ సారి సీక్రెట్ రూమ్లోకి పంపించకుండా ఇంట్లోనే ఉంచేశారు. బయటకు వెళ్లేందుకు డోర్ వరకూ వెళ్లిన హారికను హోస్ట్ నాగర్జున వెనక్కు రమ్మని పిలిచి అందరిని సర్ ప్రైజ్ చేశారు.
ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణితో ఓ గేమ్ ఆడించి కుటుంబ సభ్యుల గురించి ఫీడ్ బ్యాక్ అడిగాడు. అందులో అమ్మ రాజశేఖర్ తో పాటు కొందరినీ టాప్ 5లో ఉంటారని సూచించగా లాస్య అమాయకురాలని, ఆమెకు అంతా అయోమయంగా ఉందని చెప్పింది. హీరో-జీరో రౌండ్ లో ఎక్కువసార్లు హీరో క్యాప్ అందుకున్న గంగవ్వ ఫైనలిస్ట్ అవలేదని జోస్యం చెప్పింది.
చివరిసారిగా కరాటే కళ్యాణి హౌస్లో ఒకరిని నామినేషన్లోకి పంపించింది. హారిక, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, అభిజిత్ టాప్ 5లో ఉంటారని తెలిపింది. మోనాల్ చుట్టూరా ముగ్గురు కట్టప్పలు ఉన్నారని ఎప్పుడైనా వెన్నుపోటు తప్పదని జాగ్రత్తలు చెప్పింది. చివరివరకూ ఉండేవారిలో గంగవ్వ, కుమార్ సాయి, అరియానా, సుజాత, సోహైల్ చివరి ఐదుగురిలో ఉంటారని తెలిపింది.
దేవి బ్రిలియంట్ అని తక్కువ అంచనా వేయకండని సూచించింది. అవినాష్- అమాయక చక్రవర్తి, మెహబూబ్- ఇంటిలిజెంట్, లాస్య – ఇన్నోసెంట్, అయోమయమని తెలిపింది. అఖిల్కు తనలాగే ఆవేశమెక్కువని, కొందరిని దూరంగా ఉంచాలని హితబోధ చేసింది. తర్వాత ఓ హరికథ చెప్పి దేవిని తర్వాత వారానికి నామినేట్ చేస్తున్నట్లు బిగ్బాంబ్ వేసింది.
దేశంలోనే ఏ బిగ్బాస్ షోకు రానంత టీఆర్పీ ఈ సీజన్ మొదటి వారానికి వచ్చిందని నాగ్ వెల్లడించడంతో ఇంటి సభ్యులు ఎగిరి గంతేశారు.