Home » హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… సిద్దిపేటలో ఎఫ్ఐఆర్పై క్వాష్ పిటిషన్
Published
2 months agoon
By
bheemrajRaghunandan quash petition : దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లళ్లో రూ.18 లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టు కథ అల్లారని పిటిషన్ లో పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో తనపై నమోదైన కేసులను కొట్టి వేయాలంటూ హైకోర్టులో రఘునందర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు మామ ఇంట్లో రూ.18 లక్షలు దొరికాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అదంతా కట్టుకథ అని..తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఆ కేసులన్నింటినీ కొట్టి వేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ పిటిషన్ జస్టిస్ లక్మణ్ బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. దీంతో రఘునందన్ క్వాష్ పిటిషన్ సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు. రేపు లేదా దీపావళి పండుగ తర్వాత ఈ పిటిషన్ ను విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.