ఆధార్ – పాన్ లింక్ గడువు పొడిగింపు
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ (CBDT) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆదాయ పన్ను సేవలను మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధానం తప్పనిసరి చేసినట్లు చెప్పింది. ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 139 AA సబ్ సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును ఖచ్చితంగా అనుసంధానం చేసుకోవాలని CBDT ట్విట్టర్ వేదికగా తెలిపింది.
ఆధార్, పాన్ తో అనుసంధాన గడువును పొడిగించడం ఇది వరుసగా 8వ సారి కావడం గమన్హారం. 2017 జూలై 01 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి తమ ఆధార్ నెంబర్ ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. పాన్ కార్డును ఆదాయ పన్ను శాఖ ఇస్తుంది. ట్యాక్స్ పాలసీ నిబంధనలను సీబీడిటీ నిర్ణయిస్తుంది.
The due date for linking of PAN with Aadhaar as specified under sub-section 2 of Section 139AA of the Income-tax Act,1961 has been extended from 31st December, 2019 to 31st March, 2020.
Notification no.107 of 2019 dated 30/12/2019 issued by CBDT.— Income Tax India (@IncomeTaxIndia) December 30, 2019
పాన్-ఆధార్ అనుసంధానం చెయ్యకపోతే కలిగే నష్టాలు:
* పాన్ తో ఆధార్ అనుసంధానం చెయ్యకపోతే.. జనవరి 1, 2020 నుంచి పాన్ కార్డు చెల్లుబాటు (ఇన్ ఆపరేటివ్) కాదు
* పాన్ కార్డు ఉన్నా లేనట్టే
* ఆర్థిక లావాదేవీలు చెయ్యడానికి వీలు కాదు
* ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ఐటీఆర్) ఫైల్ చెయ్యలేరు
* పాన్ కార్డు చెల్లుబాటు కాకుంటే అధిక పన్నులు కట్టాల్సి వస్తుంది
* ట్యాక్సులు చెల్లించ లేరు
* ఎక్కువ పాన్ కార్డులు ఉండటం నేరం.. రూ.10వేలు ఫైన్