డెడ్ లైన్ : ఆధార్ – పాన్ లింక్ తప్పనిసరి

  • Published By: madhu ,Published On : December 16, 2019 / 02:01 AM IST
డెడ్ లైన్ : ఆధార్ – పాన్ లింక్ తప్పనిసరి

పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పనిసరిగా..అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా నిర్ణయించారు. పాన్ నెంబర్‌ను 56768కి SMS చేయడం ద్వారా, ఆదాయపన్ను శాఖ వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇంతకుముందు 2019, సెప్టెంబర్ 30తేదీలోగా లింక్ చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. 

ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధానాన్ని తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం 2017 జులై 01 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి, సంస్థ తమ ఆధార్ నంబర్‌ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. 
రిజిస్టర్ చేయించుకున్న యూజర్లు ఇన్‌కం టాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 

* యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌తో లాగిన్ కావాలి. 
* ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళితే..లింక్ ఆధార్ అనే ఆప్షన్ కనబడుతుంది. 
* అక్కడ అడిగిన వివరాలు ఇచ్చి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. 
* ఈ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోకపోయినా..కంగారు పడాల్సిన పనిలేదు. 

* ఇన్ కం టాక్స్ ఇ ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. 
* హోమ్ పేజీలో ఎడమవైపు ఉన్న లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 
* అక్కడ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు ఎంటర్ చేయాలి. 
* లేదంటే..ఈ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. 

ముఖ్యమైన గమనిక : పాన్ కార్డులోని వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు మ్యాచ్ కావాలి. అప్పుడే ఈ రెండూ..అనుసంధానం అవుతాయి. 
Read More : దిగివస్తున్న ఉల్లిధరలు : సామాన్యులకు ఊరట