జియో యూజర్లకు Diwali ఆఫర్ : రూ.699కే Jio Phone

  • Published By: sreehari ,Published On : October 1, 2019 / 12:09 PM IST
జియో యూజర్లకు Diwali ఆఫర్ : రూ.699కే Jio Phone

పండగ సీజన్ కావడంతో మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సేల్స్ బిజీగా కనిపిస్తోంది. ఈ కామర్స్ వెబ్ సైట్లో కలిపి రిటైల్ స్టోర్లలో కూడా కొత్త స్మార్ట్ ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్న్, సబ్సిడరీ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తమ జియో ఫోన్లపై బిగ్ దీపావళి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది.

4G ఫీచర్లతో మార్కెట్లో రిలీజ్ అయిన ఈ జియో ఫోన్ మోడల్ అసలు ధర రూ.15వందలు కాగా.. దీపావళి డిస్కౌంట్ ధరతో కేవలం రూ.699లకే లభ్యం కానుంది. అంటే.. సుమారుగా రూ.800 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత ఇండియన్ మార్కెట్లో ఉన్న 2G ఫీచర్ ఫోన్ల కంటే ఈ ఫీచర్ ఫోన్ ధర చాలా తక్కువ. జియో ద్వారా DIWALI 2019 OFFER ద్వారా జియో ఫోన్ కస్టమర్లుగా జాయిన్ అవుతారో వారికి జియో రూ.700 విలువైన డేటా బెనిఫెట్స్ ఆఫర్ చేస్తోంది.

జియో తొలి 7 రీఛార్జ్‌లపై అదనంగా రూ.99 విలువైన డేటా యాడ్ చేసుకోవచ్చు. అంటే.. జియో ఫోన్లపై రూ.800 వరకు ఆదా చేసుకోవచ్చు. డేటాపై రూ.70వరకు ఉండగా.. ప్రతి జియో ఫోన్ పై మొత్తంగా రూ.1500 వరకు భారీ బెనిఫెట్స్ సొంతం చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్ లో భాగంగా దసరా, దీపావళి పండగ సందర్భంగా కొత్త జియో ఫోన్ స్పెషల్ ధర రూ.699లకే లభ్యం కానుంది.

పాత ఫోన్ ఎక్సేంజ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా రూ.800 ఆదాతో సొంతం చేసుకోవచ్చునని రిలయన్స్ జియో ఒక ప్రకటనలో తెలిపింది.  ‘జియో ఫోన్ దివాళి గిఫ్ట్’ ఆఫర్ ద్వారా రూ.15వేల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.