జియో పంచ్: రేపటి నుంచి అమల్లోకి.. కొత్త ప్లాన్‌ల చార్జీలు ఇవే!

  • Published By: vamsi ,Published On : December 5, 2019 / 02:48 AM IST
జియో పంచ్: రేపటి నుంచి అమల్లోకి.. కొత్త ప్లాన్‌ల చార్జీలు ఇవే!

టెలికాం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన జియో నెట్ వర్క్.. తక్కువ కాలంలోనే ఎక్కువ కస్టమర్లను తెచ్చుకుంది. అతి తక్కువ ధరకే వాయిస్ కాల్స్ డేటా ఇవ్వడంతో ప్రతీ ఇంట్లో ఒక జియో ఫోన్ నంబర్ ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నెట్ వాడకంలో కూడా జీయో వచ్చిన తర్వాత సంచలన మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా రిలయన్స్‌ జియో టారీఫ్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది జియో.

రేపటి(2018 డిసెంబర్ 6) నుంచి మొబైల్‌ కాలింగ్‌, డేటా ప్లాన్ల చార్జీలను 39 శాతం వరకు పెంచుతుంది.  చార్జీలు పెంచినప్పటికీ కస్టమర్లకు 300 శాతం అధిక ప్రయోజనాలను అందిస్తున్నట్లు జియో స్పష్టం చేసింది. కొత్త ప్లాన్లలోనూ జియో నుంచి మరో జియో నంబరుకు కాలింగ్‌ అపరిమిత ఉచితం. ఇతర నెట్‌వర్క్‌ల నంబర్లకు మాత్రం పరిమిత ఉచిత కాలింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది సంస్థ.

వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆ సంస్థ వెల్లడించింది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా తమ ప్లాన్ల చార్జీలను ఈ నెల 3 నుంచి 50 శాతం వరకు పెంచాయి. ఈ రెండు కంపెనీలతో పోలిస్తే జియో ప్లాన్లు చౌకగానే ఉన్నాయి. 

కొత్త ప్లాన్‌ల చార్జీలు:

Jio

JIo