మెగా సేల్ : మొబైల్స్ పై ‘రిపబ్లిక్ డే’ భారీ ఆఫర్లు ఇవే

రిపబ్లిక్ డే సేల్స్ హంగామా మొదలైంది. ఆన్ లైన్ లో మొబైల్ సేల్స్ మోత మోగుతోంది. ఎక్కడ చూసిన రిపబ్లిక్ డే సేల్స్ తో మొబైల్ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు మొబైల్ తయారీ సంస్థలు సొంత ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటే..

  • Published By: sreehari ,Published On : January 24, 2019 / 12:42 PM IST
మెగా సేల్ : మొబైల్స్ పై ‘రిపబ్లిక్ డే’ భారీ ఆఫర్లు ఇవే

రిపబ్లిక్ డే సేల్స్ హంగామా మొదలైంది. ఆన్ లైన్ లో మొబైల్ సేల్స్ మోత మోగుతోంది. ఎక్కడ చూసిన రిపబ్లిక్ డే సేల్స్ తో మొబైల్ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు మొబైల్ తయారీ సంస్థలు సొంత ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటే..

రిపబ్లిక్ డే సేల్స్ హంగామా మొదలైంది. ఆన్ లైన్ లో మొబైల్ సేల్స్ మోత మోగుతోంది. ఎక్కడ చూసిన రిపబ్లిక్ డే సేల్స్ తో మొబైల్ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు మొబైల్ తయారీ సంస్థలు సొంత ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా,ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ పై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 24 నుంచి జనవరి 27 వరకు ఆన్ లైన్ లో మొబైల్స్ అమ్మకాల జోరు కొనసాగనుంది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన శాంసంగ్, వివో స్మార్ట్ ఫోన్, మైక్రోసాఫ్ట్, చైనా కంపెనీ గ్జియామీ రెడ్ మీ నోట్, రిలయన్స్ జియో తమ మొబైల్స్ పై అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, పేటీఎం మాల్ పై రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ కామర్స్ సైట్లలో ఏయే స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, ఎక్సేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓసారి లుక్కెద్దాం. 

శాంసంగ్ : జనవరి 24 నుంచి జనవరి 27 వరకు ఫ్లిప్ కార్ట్ పై శాంసంగ్ కొత్త మోడల్స్ పై భారీ ఆఫర్లు అందిస్తోంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సేల్స్ పై శాంసంగ్ గెలాక్సీ జే, గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ ప్లాగ్ షిప్ సిరీస్ లపై ఎక్సెంజ్ ఆఫర్లు అందిస్తోంది. 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9: ఈ ఫోన్ పై ఎక్సట్రా రూ. 9వేలు ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ప్రారంభ ధర రూ.67,900 ఉంటే.. కస్టమర్లు ఎక్సేంజ్ ఆఫర్ పై రూ.9వేలు పొందొచ్చు. 
శాంసంగ్ గెలాక్సీ ఏ7 : దీని ప్రారంభ ధర రూ.18,990. ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్లను ఇటీవలే ఆఫర్ చేసింది. ట్రిపుల్ కెమెరా ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ పై రూ.18,990 ఉంది. ఎక్సేంజ్ ఆఫర్ పై రూ. 14,900 వరకు పొందొచ్చు. ఈఎంఐ ఆఫర్ అయితే నెలకు ప్రారంభ ఈఎంఐ ధర రూ.631 మాత్రమే. 
శాంసంగ్ గెలాక్సీ ఏ9 : ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 33,990. భారత్ లో మాత్రం రూ.36,990 ధరతో మార్కెట్లలోకి ప్రవేశించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ పై డిస్కౌంట్ రూ. 3వేల వరకు ఉంది. ఎక్సేంజ్ ఆఫర్ పై రూ. 14,900 వరకు ఉండగా, ఈఎంఐ ప్రారంభ ధర నెలకు రూ.1,129. 
శాంసంగ్ గెలాక్సీ ఎస్9: దీని ప్రారంభ ధర రూ. 52,900. 18 శాతం డిస్కౌంట్ తో లభిస్తోంది. రిటైల్ ధర రూ.64,900 తో 64జీబీ స్టోరేజ్ లభిస్తోంది. 

వివో.. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై కొత్త ఆఫర్లను అందిస్తోంది. వివో ఫోన్లపై ఎక్సేంజ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో అదరగొట్టేస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ యూజర్లను ఆకర్షించేలా ఉంది. 

వి9 ప్రో (4జీబీ): ప్రారంభ ధర రూ.15,990. సేల్ ప్రైస్ రూ.13.990. రూ.వెయ్యి వరకు ఎక్సేంజ్ ఆఫర్. 
వి9 ప్రో (6జీబీ): ఎంఆర్పీ ధర రూ.18,350 ఉంటే.. సేల్ ప్రైస్ రూ.15,990. అమెజాన్ ప్లాట్ ఫాంపై నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. 
వివో ఎన్ఈఎక్స్: ప్రారంభ ధర రూ.39,990. ఎక్సేంజ్ ఆఫర్ రూ. 5వేల వరకు. అమెజాన్ ప్లాట్ ఫాంపై అందుబాటులో ఉంది.  
వి11 ప్రో: దీని ఎఆర్పీ ధర రూ. 25,990. ఎక్సేంజ్ పై రూ.3వేలు మాత్రమే. అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. 

గ్జియామీ రెడ్ మీ నోట్ : రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా గ్జియామీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ కామర్స్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పోర్టల్స్ పై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. రెడ్ మీ నోట్ 5 ప్రో, రెడ్ మీ వై2, రెడ్ మీ నోట్ 6 ప్రో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 

రెడ్ మీ నోట్ 5 ప్రో (4జీబీ/64జీబీ): ఈ ఫోన్ 10 శాతం డిస్కౌంట్ పై కేవలం రూ.9,990లకే లభిస్తోంది. మరో కొన్ని రోజుల మాత్రమే ఈ ఆఫర్ అమెజాన్ ఇండియాపై అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ ధరలు రూ.13,999, రూ.16,999. హెడ్ ఎఫ్ సీ, ఎస్బీఐ కార్డులపై రూ.వెయ్యి (10 శాతం) డిస్కౌంట్ తో రూ.12,999 కే లభిస్తోంది. మరో ఫోన్ 10 శాతం డిస్కౌంట్ తో రూ.11,770కి మాత్రమే లభిస్తోంది. 

మొబైల్ స్మార్ట్ ఫోన్ రారాజు ఆపిల్ కంపెనీ దిగ్గజం ఐఫోన్లకు ఉండే క్రేజే వేరు. రిపబ్లిక్ డే సందర్భంగా ఐఫోన్లపై కూడా భారీ ఆఫర్లు అందిస్తోంది కంపెనీ. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా పేటీఎం మాల్ పై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ అందిస్తోంది. దాదాపు రూ.8వేల క్యాష్ బ్యాక్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 7, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్.. ఇలా పలు మోడల్స్ లో ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి.  

ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ (64జీబీ) : ఈ ఐఫోన్ రూ.109.799లు ఉండగా.. రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. 
ఐఫోన్ ఎక్స్ (64జీబీ): ఈ ఐఫోన్ విలువ 9 శాతం డిస్కౌంట్ తో కలిపి రూ. 75,329 ఉండగా.. పేటీఎం మాల్ పై రూ.8,370 అడిషనల్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. 
ఐఫోన్ 8, 8 ప్లస్ (64 జీబీ): ఈ ఫోన్ 6 శాతం డిస్కౌంట్ తో కలిపి రూ.54,591 కే అందుబాటులో ఉండగా.. అడిషనల్ క్యాష్ బ్యాక్ రూ.5,399 వరకు పొందొచ్చు. అలాగే ఐఫోన్ 8 ప్లస్ ఫోన్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తుండగా.. ధర రూ.66,490 వరకు ధర పలుకుతోంది. అడిషనల్ క్యాష్ బ్యాక్ విలువ రూ.3,500 వరకు పొందొచ్చు. 
ఐఫోన్ ఎస్ఈ (32జీబీ): ఐఫోన్ ఎస్ఈ 25 శాతం డిస్కౌంట్ పై రూ. 18,429కే అందుబాటులో ఉండగా.. అడిషనల్ క్యాష్ బ్యాక్ రూ. 970 వరకు పొందొచ్చు. 
ఐఫోన్ 7, 7ప్లస్ (32జీబీ): ఈ ఐఫోన్ 7 పై 24 శాతం డిస్కౌంట్ తో రూ.36,117 ధర ఉండగా.. క్యాష్ బ్యాక్ రూ.3,572.  
ఐఫోన్ 7ప్లస్ (32జీబీ): ఈ ఐఫోన్ 7 ప్లస్ పై 18 శాతం డిస్కౌంట్ తో రూ.47,886 ధర ఉండగా.. క్యాష్ బ్యాక్ రూ.3,604.