బిగ్ షాక్ : ఏ క్షణమైనా రూ.2వేలు నోటు రద్దు

దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 02:18 AM IST
బిగ్ షాక్ : ఏ క్షణమైనా రూ.2వేలు నోటు రద్దు

దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల

దేశ ప్రధాని మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? రూ.2వేల నోటుని బ్యాన్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. రూ.2వేల నోటు మార్కెట్ లో కనిపించడం లేదు.  జనాలు రూ.2వేల నోటు చూసి చాలా రోజులే అయ్యింది. ఇకపోతే..ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రించలేదనే నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏ క్షణమైనా రూ.2వేల నోటుని రద్దు  చేశాము అనే ప్రకటన ప్రభుత్వం నుంచి రావొచ్చని అంతా అనుకుంటున్నారు.

ప్రధాని మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో నోట్ల రద్దు ఒకటి. 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఎంతోకాలంగా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ  తర్వాత కొత్త రూ.500 నోటుతో పాటు రూ.2వేల నోటును ప్రవేశపెట్టారు. కొన్నిరోజులుగా రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేశారు. వీటి వాడకం కూడా గణనీయంగా తగ్గింది. ఏటీఎంలలో అస్సలు కనిపించడం లేదు.

ఈ పరిస్థితుల్లో త్వరలోనే రూ.2 వేల నోటును రద్దు చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఏటీఎంకు వెళ్లి రూ.2వేలకు మించి డబ్బు డ్రా చేస్తే పెద్ద నోటు తప్పక వచ్చేది. కానీ, కొద్దిరోజులుగా ఈ నోటు  అంతగా కనిపించడం లేదు. కారణం, రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ని ఆర్బీఐ నిలిపేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన  ప్రశ్నకు ఆర్బీఐ ఈ వివరాలు వెల్లడించింది.

ఆర్టీఐ సమాచారం ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ  2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది. 2019లో మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం  చేసింది. దీంతో రూ.2వేల నోట్లు రద్దు కానున్నాయా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అధిక విలువ కలిగిన నోట్ల చలామణిని తగ్గించడం ద్వారా బ్లాక్ మనీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు  అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో రూ.6 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో బ్లాక్‌మనీని అరికట్టేందుకు ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక పోతే 
గత మూడేళ్లలో రూ.50 కోట్ల నకిలీ రూ.2వేల నోట్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం ఆందోళన నింపింది.