Sensex: యుక్రెయిన్, రష్యా యుద్ధం.. భారత్లో రూ.వేల కోట్ల సంపద ఆవిరి!
యుక్రెయిన్పై రష్యా దాడి వార్తల నేపధ్యంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా పడిపోయి 55,500 దిగువకు చేరుకుంది.
Sensex: యుక్రెయిన్పై రష్యా దాడి వార్తల నేపధ్యంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా పడిపోయి 55,500 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 500 పాయింట్లు పడిపోయింది. దీంతో భారత్లో వేలకోట్ల సంపద ఆవిరి అయిపోయింది.
యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కారణంగా ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే మార్కెట్లో ఆల్ రౌండ్ అమ్మకాలు కనిపిస్తున్నాయి. ప్రీ-ఓపెనింగ్లోనే మార్కెట్ 3 శాతానికి పైగా పడిపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు ప్రారంభమైన వెంటనే 4 శాతం పడిపోయాయి. అన్ని రంగాల సూచీలు రెడ్ మార్క్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఓపెన్ స్టాక్ మార్కెట్:
దేశీయ స్టాక్ మార్కెట్ ఓపెనింగ్లోనే ఎరుపు గుర్తులో కనిపిస్తుంది. సెన్సెక్స్ 1813 పాయింట్ల భారీ పతనంతో 55వేల 418 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 514 పాయింట్ల బలమైన పతనంతో 16,548 వద్ద స్టార్ట్ అయ్యింది.
మార్కెట్లో ఆల్ రౌండ్ విక్రయాలు..
ఆల్ రౌండ్ విక్రయాలు, తీవ్ర భయాందోళనల కారణంగా స్టాక్ మార్కెట్ రెడ్ మార్క్లో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ స్టాక్లలో 50 పతనంతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లు బద్దలు కొట్టి 2.69 శాతం పతనంతో 36422 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీలో మొత్తం 12 స్టాక్లు లాస్లో ట్రేడవుతున్నాయి.