Home » భారత్ లో 12 లక్షలు దాటిన కరోనా కేసులు
Published
7 months agoon
By
bheemrajభారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వారం రోజులుగా 32 వేలకు పైగా పాజటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న 37 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రికార్డు స్థాయిలో 45 వేలకుపైగా మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో కరోనా కేసులు 12 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 45,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,38,635కు చేరింది. అదేవిధంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,26,167 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 7,82,606 మంది బాధితులు కోలుకున్నారు. ఉదయం వరకు కొత్తగా 1129 మంది మరణించారు. దేశంలో ఒకేరోజు నమోదైన కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 29,861కు పెరిగింది.
దేశంలో జూలై 22 నాటికి 1,50,75,369 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. నిన్న ఒకేరోజు దేశవ్యాప్తంగా 3,50,823 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
మోదీ స్టేడియాన్ని నిషేధించాలి
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టుకు దూరమైన కీలక ప్లేయర్
ఏం చెప్తిరి..ఏం చెప్తిరి.. చలికాలం పోతే పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న కేంద్రమంత్రి, సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ విస్కీల హల్చల్
60 వేల నాణేలతో రాముడు, అయోధ్య రామ మందిరానికి మద్దతు
ముందు శాంతి తర్వాతే ద్వైపాక్షిక సంబంధాలు..చైనాకు తేల్చిచెప్పిన భారత్