16 ఏళ్ల యువతిపై 14 ఏళ్ల యువకుల సామూహిక అత్యాచారం
పంజాబ్ లోని లూధియానాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల యువతిపై 14 ఏళ్ల యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఒకరి ఇంట్లో సహాయకురాలిగా పనిచేసే, యువతి తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న ఆమెను గమనించిన టీనేజీ కుర్రాళ్లు, తమ కామ వాంఛ తీర్చుకోవాలనుకున్నారు.
అనుకున్నదే తడవుగా ఆమెను బలవంతంగా తమ బైక్పై ఎత్తుకెళ్లారు. ఆమె కంటే తక్కువ వయస్సున్న ఆ కుర్రాళ్లు తమ గదికి తీసుకెళ్లి ఆమెపై సామూహికంగా లైంగిక దాడి చేశారు. అదంతా తమ సెల్ఫోన్లలో వీడియో రికార్డింగ్ చేసి అందరికీ చూపిస్తామని బెదిరించారు. గత ఆదివారం… ఆగస్టు 30న పంజాబ్లోని లూధియానాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
https://10tv.in/tdp-chief-chandrababu-meets-acham-naidu-and-kollu-ravindra/
లూధియానాకు చెందిన ఓ 16 ఏళ్ల యువతి ఒక ఇంట్లో సహాయకురాలిగా పనిచేస్తోంది. ఆగస్టు 30న, ఆదివారం రాత్రి యజమాని ఇంట్లో తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కొందరు టీనేజీ కుర్రాళ్లు ఆమెను చూశారు. వారికి ఆమెను అనుభవించాలనే కోరిక పుట్టింది. ఒంటరిగా ఉన్న ఆడపిల్లను చూడగానే వారిలో రాక్షసుడు నిద్రలేచాడు.
వారిలో ఇద్దరు తమ బైక్పై ఎక్కాలని ఆమె వద్దకు వచ్చి బలవంతం చేశారు. ఆమె నిరాకరించడంతో… యాసిడ్ పోస్తామని బెదిరించారు. దీంతో భయపడిన ఆమె వారి బైక్ పై ఎక్కింది. అక్కడ్నించి యువకులు ఆమెను తమ రూమ్కు తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహికంగా బలాత్కారం చేశారు. దాన్నంతా వారి ఫోన్లలో వీడియో రికార్డు చేశారు. ఈవిషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
దీంతో తనపై జరిగిన లైంగిక దాడిని గురించి రెండు రోజుల వరకు ఎవరి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కాగా, మంగళవారం రాత్రి ఈ ఘటనను గురించి తన తల్లికి చెప్పింది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులపై ఐపీసీ 376-డీ (గ్యాంగ్రేప్) సెక్షన్తోపాటు, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. నిదింతులంతా 14 నుంచి 16 ఏళ్లలోపువారేనని పోలీసులు తెలిపారు.