అరుణాచలంలో అమెరికా అమ్మాయిపై సాధువు అత్యాచారయత్న..కత్తితో కోసిపడేసింది

  • Published By: nagamani ,Published On : August 24, 2020 / 05:50 PM IST
అరుణాచలంలో అమెరికా అమ్మాయిపై సాధువు అత్యాచారయత్న..కత్తితో కోసిపడేసింది

తమిళనాడులోని తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో దారుణం జరిగింది. అమెరికాకు చెందిన యువతిపై ఓ స్వామిజీ అత్యాచారానికి యత్నించాడు. కానీ చేసిన పనికి దేహశుద్దితో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంద పాపం గురుడికి..

భారతదేశంలో గుడులకు కొదువ లేదు. చారిత్రాత్మకంగా..ఆధ్యాత్మికతకు పేరొందిని తమిళనాడు గుడులకు ఆలవాలం..ముఖ్యంగా తమిళనాడులోని తిరుమణ్ణామలై అంటే అగ్నిలింగంగా శివుడు పూజలందుకునే మహా పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఓకారం నాదానికి బదులు ఓ అబల ఆర్తనాదం వినిపించిన దుర్ధటన జరిగింది. ఐదు నెలల క్రితం తిరువణ్ణామలై వచ్చి అరుణాచలేశ్వరుడిని దర్వించుకున్న ఓ అమెరికా అమ్మాయిపై ఓ సాధువు అత్యాచారానికి తెగబడేందుకు తయ్నించాడు. కానీ ఆమె ఎదురు తిరగటంతో సాధువుకి దేహశుద్ది జరిగింది.

వివరాల్లోకి వెళితే..అమెరికా నుంచి 31 ఏళ్ల మహిళ భారతదేశ యాత్రకు వచ్చి ..అరుణాచలేశ్వరుడిని సందర్శించుకుంది. కానీ లాక్ డౌన్ వల్ల తిరిగి అమెరికా వెళ్లలేక పోయింది. దీంతో స్థానికంగా ఉన్న అరుణాచలనగర్‌లో ఒక ఇంటిలో అద్దెకు ఉంటోంది. ఈ ప్రాంతంలో సాధువులు, స్వామిజీలు ఎక్కువగా ఉంటారు.

ఈక్రమంలో నామకల్‌ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగందన్‌ అనే 41 వ్యక్తి స్వామిజీగా మారి ఇదే ప్రాంతంలో ఉంటున్నాడు. ఈక్రమంలో ఆదివారం (ఆగస్టు 23,2020) ఉదయం ఆ అమెరికా మహిల ఇంటిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మణిగందన్‌ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

దీంతో ఆమె కేకలు వేస్తూ ఇంటిలో ఉన్న కత్తితో మణిగందన్‌ పై దాడి చేసింది. తన మీద పడబోయిన ఆ సాధువుని కత్తితో దాడి చేయటంతో అతని మొహంపై కత్తిగాట్లు పడ్డాయి. దీంతో వాడు పరుగులంఘించుకున్నాడు. ఇంతలో ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని స్వామీజీకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. భారతదేశం పరువు తీసావు దరిద్రుడా అంటూ తిట్టిపోశారు.