వేధింపులు భరించలేక భర్త హత్య..సాయం చేసిన అత్త

  • Published By: murthy ,Published On : July 22, 2020 / 11:17 AM IST
వేధింపులు భరించలేక భర్త హత్య..సాయం చేసిన అత్త

భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు.

అకారణంగా రోజు భర్త తనతో గొడవ పెట్టుకోవటం తట్టుకోలేని భార్య, భర్తను హతమార్చాలనుకుంది. ఈ విషయం తన అత్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి లోకనాధ రెడ్డిని హత్య చేశారు.

స్ధానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.