కోరికలు తీర్చలేక….గర్భిణి భార్యను హత్య చేసిన భర్త

  • Published By: murthy ,Published On : September 5, 2020 / 12:49 PM IST
కోరికలు తీర్చలేక….గర్భిణి భార్యను హత్య చేసిన భర్త

గ్రేటర్ నోయిడాలో భయానక ఘటన జరిగింది. భార్య కోరికలను తీర్చలేని భర్త ఆమెను  దారుణంగా సుత్తితో కొట్టి చంపేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా ఒక పత్రికా కార్యాలయానికి వెళ్లి ఈవిషయం చెప్పాడు.  వారు పోలీసులకు సమాచారం అందించటంతో, పోలీసులు నిందితుడినిఅదుపులోకి తీసుకున్నారు.



వేర్వేరు మతాలకు చెందిన అఖిలేష్ కుమార్, బిజ్లీ, 2015 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు వైపులా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న అఖిలేష్ భార్యా ఇద్దరు పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలోని దాదా గ్రామంలోని కస్నాలో  కాపురం ఉంటున్నాడు. ప్రస్తుతం బిజ్లీ 8 నెలల గర్భవతి.

సెప్టెంబర్2వ తేదీ, బుధవారం నాడు అఖిలేష్, బిజ్లీ మధ్య వాగ్వివాదం జరిగింది. కోపం పట్టలేని అఖిలేష్ భార్య బిజ్లీపై దాడి చేశాడు. భవన నిర్మాణంలో ఉపయోగించే పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి, సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం సమీపంలోని పత్రికా కార్యాలయానికి వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు తెలిపాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.



అఖిలేష్ చెప్పిన చిరునామాకు వచ్చిన పోలీసులకు  హత్యచేసి భార్య శవం పక్కన కూర్చోని ఉన్న అఖిలేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసు విచారణలో అఖిలేష్ భార్యతో విసుగు చెంది హత్య చేసినట్లు చెప్పాడు.
https://10tv.in/wife-eliminate-her-husband-with-relative-friends-guntur-district/
పెళ్ళైన నాటి నుంచి ఆమె కోరికలు ఎక్కువ స్దాయిలో ఉండేవని..తన జీవన శైలి ఆమెకు నచ్చేది కాదని చెప్పుకొచ్చాడు. పెళ్లైన నాటి నుంచి ఆమె కోసం అనేక చోట్ల ఇల్లు మారానని…. ఇటీవల సొంతంగా ఒక ప్లాట్ కొన్నానని చెప్పాడు. అది కూడా ఆమెకు నచ్చలేదని…. ఆవిషయమై ఆమె తరచూ గొడవ పడుతోందని తెలిపాడు.



తన ఆర్ధిక పరిస్ధితి తెలిసి కూడా ఆమె విపరీతమైన కోరికలు కోరేదని…. అవి తీర్చే స్ధోమత తనకు లేదని చెప్పాడు.  ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె వైవాహిక జీవితం పట్ల అసంతృప్తి గా ఉండేదని… ఎప్పుడూ విచారం వ్యక్తం చేసేదని వివరించాడు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.