ప్రియుడితో శృంగారం చేస్తూ దొరికిపోయిన కూతురు… పేరెంట్స్ ఏం చేశారంటే…….

  • Published By: murthy ,Published On : August 6, 2020 / 08:26 PM IST
ప్రియుడితో శృంగారం చేస్తూ దొరికిపోయిన కూతురు… పేరెంట్స్ ఏం చేశారంటే…….

ప్రియుడితో శృంగారంలో మునిగి తేలుతున్న కూతుర్ని చూసిన పేరెంట్స్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరినీ ఇంట్లో బంధించి ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా లో ఈ దారుణం జరిగింది.

బందా జిల్లా మాతుండా ఏరియా లోని కర్చా గ్రామంలో నివసించే ప్రియాంక(19) అదే గ్రామానికి చెందిన భోలా (23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం ఆగస్ట్ 5న ఇంట్లో తల్లి తండ్రులు పనిమీద వేరే గ్రామానికి వెళ్లటంతో భోలా ప్రియురాలు ప్రియాంక ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవటం తామిద్దరే ఏకాంతంగా ఉండటంతో ప్రేయసి ప్రియులు శృంగారంలో మునిగి పోయారు.

ఇద్దరూ ఆనంద డోలికల్లో తేలయాడుతుండగా ఉన్నట్టుండి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. ప్రియుడితో నగ్నంగా ..అసభ్యకరరీతిలో ఉన్న కూతురుని చూసిన తల్లితండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామంలో తమ పరువు తీసిందని బాధపడ్డారు. ఆవేశంతో వాళ్లిద్దరినీ గుడిసె లోనే ఉంచి బయట గడియపెట్టారు. ఆవేశంతో గుడిసెకు నిప్పు పెట్టారు.

అగ్ని కీలల్లో చిక్కుకున్న ప్రేయసి ప్రియులు మంటల్లో కాలి పోయారు. ప్రియుడు భోలా అక్కడి గుడిసెలోనే బూడిదలా మారగా… ప్రియాంక80 శాతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడసాగింది. ఘటనను చూసిన స్దానికులు ప్రియాంకను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమించటంతో ఆమెను కాన్పూర్ తీసుకువెళ్లమని డాక్టర్లు సూచించారు.

కాన్పూర్ తీసుకువెళుతుండగా మార్గమధ్యలో ప్రియాంక కన్నుమూసింది. పోలీసులు కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు ఆగస్టు6న పోస్టు మార్టం నిర్వహించారు. పరువు హత్య కోణంలో విచారణ జరుపుతున్నామని..ఇప్పటికే కుటుంబంలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని..మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు ఏఎస్పీ ప్రతాప్ సింగ్ తెలిపారు.