మనవరాలిపై అత్యాచారం చేసిన తాత,మేనమామ

  • Published By: murthy ,Published On : August 15, 2020 / 09:23 AM IST
మనవరాలిపై అత్యాచారం చేసిన తాత,మేనమామ

బీహార్ లో దారుణం జరిగింది 20 ఏళ్ల యువతిపై ఆమె మేనమామ అత్యాచారం చేసాడు. బీహార్లోని కతిహార్ జిల్లాలో తల్లి తండ్రులనుకోల్పోయిన యువతి(20) తన మేనమామ వద్దకు చేరుకుంది. వారు ఆమెకు పూర్ణియా జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొన్ని పరిస్ధితుల పెళ్లైన కొన్నాళ్లకు ఆమె తిరిగి తన మేనమామ వద్దకు వచ్చింది.



ఆమె గత 9 నెలలుగా తన మేనమామ వద్దే ఉంటోంది. కాగా ఆమె తన మేనమామ వద్దకు వచ్చినప్పటినుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. తాను బాలిక పై లైంగిక దాడి చేయటమే కాక బాలికకు తాత అయిన తన తండ్రితో కూడా అత్యాచారం చేయించాడు. ఈవిషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించటంతో బాలిక మౌనంగా తనపై జరిగిన అఘాయిత్యాన్ని భరించింది.



ఇటీవల బాలిక గర్భం దాల్చటంతో తన భర్త వద్దకు వెళ్ళి గోడు  వెళ్లబోసుకుంది. భర్త  ఆదుకుంటాడనుకున్న యువతికి అక్కడా నిరాశే ఎదురయ్యింది. గర్భంలో ఎవరి బిడ్డను మోస్తున్నావో వారి వద్దకే  పొమ్మని భర్త ఆమెను గెంటి వేశాడు.  దీంతో ఆ యువతి తిరిగి మేనమామవద్దకు వచ్చింది. ఈవిషయమై గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. మేనమామ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయకుండా ఉండమని…అందుకుగాను 2లక్షల రూపాయలు చెల్లిస్తారని పెద్దలు తీర్పు చెప్పారు.



యువతి తన కుటుంబ పరువు తీసేసిందనే కోపంతో వారు ఇంటినుంచి బయటకు గెంటేశారు. జరిగిన దారుణానికి చింతిస్తూ బాలిక తన కుటుంబంలోని మేనమామ, తాతయ్యలతోసహా మరో నలుగురిపై ఫాల్కా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.