చిన్నమ్మ టైం ఏం బాలేదు…రూ.300 కోట్ల ఆస్తులు జప్తు ?

  • Published By: murthy ,Published On : September 1, 2020 / 09:06 AM IST
చిన్నమ్మ టైం ఏం బాలేదు…రూ.300 కోట్ల ఆస్తులు జప్తు ?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి… చిన్నమ్మ శశికళ టైం ఏ బాగోలేదు… రేపో మాపో బెంగుళూరు పణప్పర అగ్రహార జైలు నుంచి విడుదలై చెన్నై వచ్చి చక్రం తిప్పుదామనుకుంటున్న శశికళకు చెందిన రూ. 300 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అధికారుల జప్తు చేశారు. 2003-2005 లో ఓ సెల్ ఫోన్ సంస్ధ ద్వారా బినామీ పేర్లతో అక్రమాస్తులను పొందినట్లు వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి.



ఆ కేసులో శిక్షపడి బెంగుళూరు లోని పరప్పణ అగ్రహార జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఐటీ శాఖ బినామీ నిరోధక విభాగం జప్తు చేసిన ఆస్తుల్లో ……చెన్నై శివార్లలో 200 ఎకరాల భూమితోపాటు 65 రకాల ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.



ఇందులో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్నమ్మ బస చేయడం కోసం పోయెస్‌ గార్డెన్‌ వేద నిలయంకు ఎదురుగా నిర్మిస్తున్న భవనం స్థలం కూడా ఉండడం గమనార్హం. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.300 కోట్లుగా తేల్చారు. ఈ జప్తుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.