నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..డీసీఎంను ఢీ కొట్టిన కారు

  • Published By: murthy ,Published On : November 2, 2020 / 03:43 PM IST
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..డీసీఎంను ఢీ కొట్టిన కారు

nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద సోమవారం తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి షాద్ నగర్ వెళ్తున్నకారు ఐటి పాముల దగ్గర, రోడ్డుపక్కన నిలిపి ఉంచిన డీసీఎం వ్యాను ను బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దుర్గ అనే మహిళ అక్కడి కక్కడే మరణించింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



ప్రమాద సమయంలో కారు అతివేగంగా ఉన్నట్లు తెలిసింది. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.