సాధ్వి పై నలుగురు దుండగుల సామూహిక అత్యాచారం

  • Published By: murthy ,Published On : September 9, 2020 / 04:01 PM IST
సాధ్వి పై నలుగురు దుండగుల సామూహిక అత్యాచారం

జార్ఖండ్ లోని  ఒక ఆశ్రమంలో మహిళా సాధువుపై నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఆశ్రమంలోకి సోమవారం రాత్రి నలుగురు దుండగులు ప్రవేశించారు. వారు బలవంతంగా ఆశ్రమంలోకి  ప్రవేశించి అక్కడ ఉన్న నలుగురు సాధ్విలను ఒక గదిలో బంధించారు.

వారిలో ఉన్న 38 ఏళ్ల సాధ్విపై నలుగురూ సామూహిక అత్యాచారం చేశారు. దుండగులను ప్రతిఘటించబోయిన ఇతర సాధ్విలను తీవ్రంగా కొట్టారు. మంగళవారం అత్యాచారానికి గురైన సాధ్వి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.



https://10tv.in/4-indian-astronauts-are-training-in-russia/
ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు  బాధితురాలు ఇచ్చిన వివరాలతో ముగ్గురు  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్ననాలుదగవ నిందితుడి కోసం గాలిస్తున్నారు.
https://10tv.in/peeved-over-affair-with-sister-brother-slits-mans-throatdelhi/
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారిపోతోందని …. హేమంత్ సోరెన్ ప్రభుత్వం నేరాలను అదుపు చేయటంలో విఫలం అయ్యిందని గొడ్డాకు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శించారు.