స్నేహితుడి మూడేళ్ల కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు

  • Published By: nagamani ,Published On : October 21, 2020 / 02:03 PM IST
స్నేహితుడి మూడేళ్ల కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు

Uttar Pradesh father friend 3 year old girl raped,murdered : ఉత్తరప్రదేశ్ లో నేరాలకు అడ్డాగా మారిపోయింది.చిన్నారుల నుంచి పండు ముసలివారిపై కూడా అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల అత్యాచారాల ఘటనలు మరింతగా పెరిగిపోయాయి. చిన్నారులు కామాంధుల కిరాతకానికి ఛిద్రమైపోతున్నారు. లేత శరీరాలపై అత్యాచార కాండలకు ఛిద్రమైపోతున్న బతుకులు ఆడపుట్టుకల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో యూపీలో జరిగిన అత్యాచారాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి.


ఈ క్రమంలో 3 ఏళ్ల చిన్నారిపై తండ్రి వయస్సు కలిగిన కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి స్నేహితుడే ఈ దారుణానికి తెగబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో మంగళవారం (అక్టోబర్ 20,2020) ఉదయం మూడేఏళ్ల చిన్నారిపై తండ్రి స్నేహితుడు అత్యాచారం చేసి హత్య చేసిన దారుణం స్థానికంగా కలకలం సృష్టించింది.



https://10tv.in/bhopal-12-year-old-girl-blackmailed-raped-repeatedly-by-3-men-she-met-online-friends/
అత్యాచారం చేసిన తరువాత ఆ చిన్నారిని చంపేసిన ఆ కామాంధుడు మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని కవి నగర్ పారిశ్రామిక ప్రాంతంలో పడేశాడు. చిన్నారి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ దర్యాప్తులో భాగంగా చిన్నారిని అత్యాచారం చేసిన చంపేసిన వ్యక్తి ఆ చిన్నారి తండ్రికి స్నేహితుడేనని.. అతను 32ఏళ్ల చందన్ అని తెలిపారు. నిందితుడ్ని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


పూర్తి వివరాల్లోకి వెళితే…అత్యాచారానికి గురై హత్య చేయబడిన మూడేళ్ల చిన్నారి తండ్రి.. అతని స్నేహితుడు చందన్ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తరువాత స్నేహితుడి మూడేళ్ల కూతురితో ఆడుకుంటానని చెప్పి బాలికను తనతో తన ఇంటికి తీసుకెళ్లిన చందన్ ఆ బాలికపై అత్యాచారం చేశాడు.


బాధ తట్టుకోలేక చిన్నారి ఏడుస్తుంటే కొట్టాడు. మరోసారి అత్యాచారానికి యత్నిస్తుండగా ఆ చిన్నారి బాధతో ఏడుస్తూ పారిపోవటానికి యత్నించగా..తన బండారం బైటపడిపోతుందని చందన్ మూడేళ్ల బాలికను చంపేశాడు.


ఆ తరువాత చిన్నారి ఇంకా ఇంటికి రాకపోవటంతో తల్లి భర్తను పాప ఏందని అడిగింది. దానికి చందన్ తీసుకెళ్లాడని చెప్పి చందన్ కు ఫోన్ చేసాడు. కానీ చందన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వెళ్లగా అక్కడ కనిపించలేదు. దీంతో స్నేహితుడ్ని తన బిడ్డ ఏదని అడిగాడు. దానికి ఎప్పుడో వెళ్లిపోయిందని అబద్ధం చెప్పాడు. కానీ పాప మాత్రం ఇంటికి రాకపోవటంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇలా తమ బిడ్డను తన స్నేహితుడు చందన్ తీసుకెళ్లాడని చెప్పటంతో చందన్ కోసం వెతగ్గా అప్పటికే అతను పరారీలోఉన్నాడు. దీంతో చందన్ పై అనుమానం వచ్చిన పోలీసులు అతని కోసం గాలించగా..ఓ ప్రాంతంలో తిరుగుతుండగా గుర్తించి పట్టుకున్నారు.


పాప గురించి అడగ్గా అత్యాచారం చేశానని..తన గురించి చెబుతుందని చంపేశానని..చంపేసి ఓ చోటపడేశానని చెప్పాడు. ఈ క్రమంలో స్థానికులు ఓ చోట పాప మృతదేహం ఉందని సమాచారంతో ఆ చిన్నారి వీరి బిడ్డేనని పోలీసులు అనుకుని ఘటనాస్థలానికి వెళ్లి చూడగా..ఆ చిన్నారి తమ కూతురేనని తల్లిదండ్రులు గుర్తించారు. బాలిక మెడ..తలపై గాయాలున్నాయి పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు. నిందితుడిని విచారిస్తున్నారు పోలీసులు.