కూతుర్ని ప్రేమిస్తున్నాడని దాడి….చికిత్స పొందుతూ యువకుడి మృతి

  • Published By: murthy ,Published On : December 2, 2020 / 10:48 PM IST
కూతుర్ని ప్రేమిస్తున్నాడని దాడి….చికిత్స పొందుతూ యువకుడి మృతి

young boy assassinate lover relatives : నిజామాబాద్ లో దారుణం జరిగింది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడని… ఆమె బంధువులు చేసిన దాడిలోగాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు.

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈవిషయం తెలుసుకున్న యువతి బంధువులు 25 రోజుల క్రితం మహేష్ పై దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు.


25 రోజులుగా చికిత్స పొందుతున్న మహేష్ ఆరోగ్యం విషమించి బుధవారం కన్నుమూశాడు. యువతి తరుపు బంధువులు కొట్టడంతోనే తన కుమారుడు మృతి చెందారని మహేశ్‌ తల్లి ఆరోపించారు. మహేశ్‌ మృతికి కారణమైన యువతి బంధువులను అరెస్ట్‌ చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.