మొగుడ్ని వదిలేసి ప్రియుడితో సహజీవనం… మోజు తీరాక ….

  • Published By: murthy ,Published On : August 4, 2020 / 01:04 PM IST
మొగుడ్ని వదిలేసి ప్రియుడితో సహజీవనం… మోజు తీరాక ….

వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, తాత్కాలికమే అని తెలిసినప్పటికీ క్షణికమైన సుఖాల కోసం వెపర్లాడుతూ… జీవితాన్ని ఇబ్బందుల పాల్జేసుకుంటున్నారు కొంత మంది మహిళలు.
భద్రాద్రి కొత్త గూడె జిల్లాలో ఇదే జరిగింది.



భద్రాద్రి కొత్త గూడె జిల్లా ములకపల్లి మండలం ముత్యంపాడు గ్రామంలోమడకం జ్యోతి అనే మహిళ భర్త నరసింహారావుతో కాపురం చేసుకుంటోంది. అదే గ్రామంలో ఉండే తాటి ప్రవీణ్ అనే యువకుడు జ్యోతి పై కన్నేశాడు. గత మూడేళ్లుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు.

మొగుడ్ని వదిలేసి వస్తే తాను పెళ్లి చేసుకుంటానని, హాయిగా కాపురం చేసుకుందామని ఆమెను మభ్య పెట్టేవాడు. కొన్నాళ్లకు అతను చెప్పే మాటలు నమ్మి, జ్యోతి అతడి మాయలో పడింది. భర్తకు తెలియకుండా కొన్నాళ్లు ప్రవీణ్ తో స్నేహం చేసింది జ్యోతి. దీంతో ఇద్దరి మధ్య లైంగికసంబంధం ఏర్పడింది. అవకాశం ఉన్నప్పుడు రాసలీల్లో మునిగి తేలేవారు. స్వర్గ సుఖాలు అనుభవించసాగారు.



ప్రవీణ్ పై నమ్మకం కుదిరిన జ్యోతి ఒకరోజు భర్తను వదిలేసి ప్రియుడి దగ్గరకు వచ్చేసింది. దీంతో వాళ్లిద్దరూ గ్రామంలోనే సహజీవనం చేయటం మొదలెట్టారు. కొన్నాళ్లు ఇద్దరూ సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేశారు. ఎన్నాళ్లిలా జీవిస్తాం… పెళ్లి చేసుకుందామని జ్యోతి ప్రవీణ్ ను అడిగింది.
kdm అప్పటి నుంచి ప్రవీణ్ ఆమెతో ముభావంగా ఉండసాగాడు. కొన్ని రోజులకు ఆంటీని వదిలిపెట్టి ,తప్పించుకు తిరగ సాగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్నజ్యోతి ఆదివారం ప్రియుడు ప్రవీణ్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. దీంతోప్రవీణ్ కుటుంబసభ్యులతో సహా పరారయ్యాడు.