వివాహిత అరాచకం : నువ్వు పెళ్లిచేసుకోకుండా నాతోనే ఉండాలి..నీ సంపాదనంతా నాకే ఇవ్వాలి..

వివాహిత అరాచకం : నువ్వు పెళ్లిచేసుకోకుండా నాతోనే ఉండాలి..నీ సంపాదనంతా నాకే ఇవ్వాలి..

illigal affair.. lover kills married woman : వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి.కొంతమంది పరాయి వ్యక్తులపై పెంచుకున్న ప్రేమ ఉండో లేక మోహంతోనో..సంబంధాలు పెట్టుకుంటే మరికొంతమంది మాత్రం కేవలం డబ్బు కోసమే ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటుంటారు. అటువంటి ఓ వివాహిత డ్రైవర్ గా పనిచేసే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అతనికి వివాహం కూడా కాలేదు.కానీ ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. తాను సంపాదించింది ఆమెకే ఇచ్చేస్తున్నాడు. దాంతో ఆమె తృప్తిపడలేదు. అతను ఎప్పటికీ తనవాడిగా ఉండాలనే స్వార్థం పెంచుకుంది. నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు..నీ జీతం మొత్తం నాకే ఇచ్చేయాలి..అంటూ కండిషన్లు పెట్టింది. మరి ఆ తరువాత ఏం జరిగిందంటే..

కర్ణాటకలోని మైసూరులోని ఐటీసీ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తున్న పల్లవి అనే మహిళకు భర్త ఉన్నాడు.ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఫ్యాక్టరీలో పనిచేసే ఆమెకు అదే కంపెనీలో పనిచేసే ఓ డ్రైవర్ గా పనిచేసే రవిచంద్ర అనే యువకుడితో పరిచయం అయ్యింది. ఆ పరిచయంకాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ క్రమంలో ప్రియురాలిని సంతోష పెట్టటానికి రవిచంద్ర అవి ఇవీ కొనిచ్చేవాడు. తన జీతంలో కొంత వాటికి వీటికీ ఖర్చు పెట్టి చాలా వరకూ ఆమెకే ఇచ్చేసేవాడు. దీంతో ఆమె ఇక రవిచంద్ర ఎప్పటికీ తనవాడిగా ఉండిపోవాలి..తనకు మాత్రమే సొంతం కావాలని..అతను పెళ్లి చేసుకోకూడదు అనే స్వార్థం పెరిగిపోయింది. దీంతో రవిచంద్రకు పలు ఆంక్షలు పెట్టేది..

‘‘నువ్వు పెళ్లి చేసుకోకూడదు..నేను చెప్పినట్టుగా ఉండాలి..నువ్వు ఇంకెవరినీ పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు…నీ జీతం మొత్తం నాకే ఇచ్చేయాలి..అంటూ పలు అంక్షలు పెట్టింది. ప్రతీ చిన్న విషయానికి నాకు చెప్పకుండా ఎందుకు చేశావు? నాకు చెప్పకుండా అక్కడకు ఎందుకెళ్లావు? అంటూ పలు రకాలుగా వేధిస్తుండేది. ఈ ఆంక్షల ఒత్తిడి భరించలేక పోయాడు రవిచంద్ర. దీంతో పల్లవిమీద ఒళ్లు మండిపోయేది. విసుక్కునేవాడు. విసుక్కుంటే ‘‘నామీద నీకు ప్రేమ తగ్గిపోయింది. ఎవరితో కట్టుకుని ఊరేగాలనుకుంటున్నావు’అంటూ గొడవకు దిగేది.

దీంతో రవిచంద్రకు మనశ్శాంతి లేకండాపోయింది. ప్రతీదానికి ఆంక్షలతో ఒత్తిడికి గురయ్యేవాడు.అయితే పల్లవి పెట్టే ఆంక్షలు..నచ్చని రవిచంద్ర.. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. కానీ సాధ్యంకాలేదు.దీంతో ఆమెను చంపి పీడ విరగడ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

దీంట్లో భాగంగానే..గత ఫిబ్రవరి 23న పల్లవిని మనం ఓ చోటికి వెళదాం..నీకో సర్ ప్రైజ్ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పల్లవి ఎగిరి గంతేసి అతని తీసుకెళ్లిన చోటికి వెళ్లింది. అలా రవిచంద్ర పల్లవిని హిమ్మాపు గ్రామ సమీపంలో ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను దారుణంగా చంపేశాడు. పల్లవి కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగి..పల్లవి హత్యపై కేసు నమోదు చేసుకుని..అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పల్లవికి రవిచంద్రతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలిసింది. అలా రవిచంద్రను విచారించగా అసలు విషయం బైటపడింది.దీంతో రవిచంద్రను పోలీసులు గురువారం (మార్చి 4,2021)అరెస్ట్ చేసి కేసును విచారణను కొనసాగిస్తున్నారు.