పది రోజుల పసికందు ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన తల్లిదండ్రులు

పది రోజుల పసికందు ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన తల్లిదండ్రులు

seven days girl baby deceased parents :  మూడో సారి కూడా ఆడబిడ్డే పుట్టిందని పట్టుమని పది రోజులు కూడా లేని పసిబిడ్డను కన్నతల్లిదండ్రులకే కసాయివారుగా మారి చంపేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఊపిరి ఆడకుండా చేసి ఆ బిడ్డ చంపేసి తరువాత ఏమీ తెలియనట్లుగా బిడ్డ చనిపోయిందని నాటకాలాడారు. కానీ వారి పాపం పండింది.పసిబిడ్డ ఉసురు తీసిన కన్నవారి బండారం బైటపడి ఊచలు లెక్కపెడుతున్నారు. దీంతో మరో ఇద్దరు పసివాళ్లు కన్నవాళ్లకు దూరమైన దుస్థితి ఏర్పడింది.

మదురై ఉసిలంపట్టికి చెందిన చిన్నస్వామి, శివప్రియ భార్యాభర్తలు.వారికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఒకరికి ఐదు ఏళ్లు,మరొకరికి రెండేళ్లు. ఈ క్రమంలో శివప్రియ మరోసారి గర్భవతి అయ్యింది. ఆసారి మగపిల్లాడు పుట్టాలని కోరుకున్నారు. కానీ మూడో సారి కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో మూడోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని ఆ బిడ్డను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నారు. బిడ్డ పుట్టి 10 రోజులు కూడా కాకుండానే గత గురువారం (ఫిబ్రవరి18,2021) ఆ పసిగుడ్డు ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు.

తరువాత పాపకు సడెన్ గా అనారోగ్యంగా ఉందని చుట్టుపక్కలవారికి చెప్పి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బిడ్డను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే బిడ్డ చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. కానీ ఆ శిశువు చెవి భాగంలో చిన్న పాటి గాయం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉసిలంపట్టి పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

అనంతరం శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఊపి రాడకుండా చేసి చంపేసినట్లుగా రిపోర్టులో తేలింది. దీంతో సదరు కన్నవారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని అంగీకరించారు. మూడోసారి కూడా ఆడబిడ్డే పుట్టిందన్న ఆగ్రహంతో ఆకుటుంబానికి చెందిన వారే ఈ కిరాతకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు, శిశువు తల్లిదండ్రులు ఇద్దర్ని అదుపులోకి తీసుకుని కేసు విచారణను కొనసాగిస్తున్నారు.