పిల్లల కోసం ఘాతుకం : బాలికను చంపించి కాలేయంతో క్షుద్ర పూజలు చేసి తిసేసిన దంపతులు

  • Published By: nagamani ,Published On : November 17, 2020 / 03:41 PM IST
పిల్లల కోసం ఘాతుకం : బాలికను చంపించి కాలేయంతో క్షుద్ర పూజలు చేసి తిసేసిన దంపతులు

UP: 7 year girl raped,murder..ofter liver cut out : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ ఘతంపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికను దారుణంగా చంపేసి ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి కాలేయాన్ని (లివర్) తీసుకెళ్లిన దారుణం చోటుచేసుకుంది. బాలికను హత్య చేయటానికి ముందు అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆ బాలికను ఎందుకు చంపారో తెలిస్తే వెన్నులోంచి వణుకుపుట్టుకొస్తుంది. పిల్లలు లేని దంపతులు ఓ పాపను చంపి కాలేయాన్ని తీసుకురమ్మని ఇద్దరు కిరాయి వ్యక్తులను ఏర్పాటుచేశారు.



కేవలం 15 వందల రూపాలు ఇచ్చి ఏడేళ్ల బాలిక నూరేళ్ల జీవితాన్ని అంతం చేశారు కిరాయి గూండాలు. మరోపక్క తమకు పిల్లలు పుట్టటం కోసం ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేసి ఓ తల్లి కడుపులో చిచ్చురేపారు. దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న శుభ సమయంలో ఓ తల్లి కడుపులో చిచ్చుపెట్టారు ఆ పిల్లలు లేని దంపతులు..కాసులకు కక్కుర్తి పడ్డ ఇద్దరు కసాయి వ్యక్తులు.



వివరాల్లోకి వెళితే..కాన్పూర్ సమీపంలోని భద్రాస్ గ్రామంలో పరశురామ్‌ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి 1999లో పెళ్లి జరిగింది. కానీ ఇప్పటి వరకూ పిల్లలు పుట్టలేదు. దీంతో పరశురామ్ ఓ మాంత్రికుడిని కలిసి విషయం చెప్పాడు. దానికి ఆ మాంత్రికుడు ఓ బాలిక కాలేయాన్ని తింటే నీ భార్యకు కడుపు పండుతుందని..గర్భం దాలుస్తుందని చెప్పాడు. దీంతో పరశురామ్ తన మేనల్లుడు అంకుర్ ను పిలిచి ఏదో షాపుకు వెళ్లి సరుకులు తెమ్మన్నట్లుగా ఓ బాలిక కాలేయం కావాలని మాంత్రికుడు చెప్పాడని చెప్పుకొచ్చాడు. దాని కోసం రూ.1500లు ఇచ్చి పంపించాడు.



దీంతో అంకుర్ తన స్నేహితుడు బీరాన్ ను తీసుకుని ఆ డబ్బులతో మద్యం కొనుక్కుని ఫుల్ గా తాగారు. తమ పక్కింటింలో ఉండే ఏడేళ్ల పాప ఆడుకుంటుంటుండగా వారి కళ్లు ఆ చిన్నారిపై పడ్డాయి. ఆలూ చిప్ప్ ప్యాకెట్ కొని ఇస్తామని ఆశపెట్టి చిన్నారిని ఎత్తుకుపోయారు. అనంతరం ఆ చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత బాలిక శరీరం ఛిద్రం చేసి కాలేయాన్ని తీసు పట్టుకెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ ఆ బాలిక మృతదేహాన్ని కాన్పూర్ లోని ఓ గ్రామంలో పడేసి పోయారు. ఆ కాలేయాన్ని పట్టుకెళ్లి మామ పరశురామ్ కు ఇవ్వగా వారు మాంత్రికుడికి ఇచ్చారు. ఆ కాలేయంతో పూజలు చేసిన మాంత్రికుడు తిరిగి పరశురామ్ దంపతులకు ఇచ్చి దాన్ని తినమని చెప్పాడు. మాంత్రికుడు చెప్పినట్లుగానే ఆ కాలేయాన్ని చెరో కొంత తిని మిగిలిన భాగాన్ని ఓ కుక్కకు వేశారు.



మరోపక్క..పిల్లలు లేని దంపతులు చేసిన ఘోర కృత్యానికి దీపావళి పండుగ రోజున ఓ తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డ కనిపించక అల్లాడిపోయింది. రాత్రంతా కళ్లల్లో వత్తులు వేసుకుని గంపెడంత ఆశతో వెతుకుతూనే ఉన్నారు. బిడ్డ కోసం ఆ తల్లి గుండెలవిసేలా ఏడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం పంపించగా..చిన్నారి శరీరంలో కొన్ని అవయవాలు లేవని డాక్టర్లు తెలిపారు.



ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రంతా వెదికినా బిడ్డ కనిపించకపోయేసరికి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలకు పోలిక ఉండటంతో ఆ బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించగా తమ బిడ్డేనని వారు గుండెలు అవిసేలా ఏడ్చారు. తమకు పిల్లలు పుట్టాలని ముక్కుపచ్చలారని పసిబిడ్డను కడతేర్చిన ఆ దంపతుల చేసిన పాపం చాలా దారుణమైంది. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు వెలుగులు పంచే దీపావళి పండుగ రోజు వారి జీవితాల్లో చీకటిని మిగిల్చింది. పోలీసులు బాలిక హంతకుల కోసం గాలింపు చేపట్టారు.



పోలీసులు వారి ఇంటికి సమీపంలో ఉండే అంకుర్, బీరాన్ లపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..తామేనని అంగీకరించారు. పరశురామ్ తమకు డబ్బులిచ్చి బాలిక కాలేయాన్ని తీసుకురావాలని..దాంతో పూజలు చేసి ఆ కాలేయాన్ని తింటే వారికి పిల్లలు పుడతారని ఓ మాంత్రికుడు చెప్పాడని వారే తమకు డబ్బులిచ్చి ఈ పనిచేయమన్నారని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు పరశురామ్ ను అతని భార్యను కూడా అరెస్ట్ చేశారు.


ఈ ఘటనపై ఎస్పీ పబ్రిజేష్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..బాలికను చంపే ముందు వారు అత్యాచారం చేశారని అనంతరం గొంతు కోసం చంపేసి కాలేయంతో పాటు ఇంకా ఇతర అవయవాలను కూడా పట్టుకెళ్లారని తెలిపారు.బాలిక పోస్ట్ మార్టంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. పరశురామ్ ను అతని భార్యను అరెస్ట్ చేశామని వారికి బాలిక కాలేయం తినాలని చెప్పిన మాంత్రికుడి గురించి వివరాలు తెలుసుకుని అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. నిందితులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 301, 202 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.