షర్టు టైటుగా కుట్టాడని టైలర్ గొంతు కోసి చంపేసిన కస్టమర్

షర్టు టైటుగా కుట్టాడని టైలర్ గొంతు కోసి చంపేసిన కస్టమర్

UP Man strangles tailor to death over ill fitting shirt : టైలర్ కు బట్టలు కుట్టటానికిస్తాం. షర్టులు ప్యాంటులు, జాకెట్లు ఇలా కుట్టటానికి ఇస్తాం. కానీ ఆ టైలర్ సరిగా కుట్టకపోతే కేకలేస్తాం. కానీ ఏకంగా చంపేస్తారా? కానీ ఓ వ్యక్తి మాత్రం ఓ టైలర్ ను దారుణంగా చంపేశాడు. తన షర్టు సరిగా కుట్టలేదనే కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి టైలర్ గొంతు కోసి చంపేసిన ఘటన యూపీలో జరిగింది.

రాయ్ బరేలికి చెందిన అబ్దుల్ మజీద్ ఖాన్ అనే 65 ఏళ్ల టైరల్ కు సలీం అనే వ్యక్తి ఓ షర్టు క్లాత్ ఇచ్చి షర్టు కుట్టమన్నాడు. దానికి సలీం కొలతలు కూడా తీసుకున్నాడు మజీద్ ఖాన్. ఆ తరువాత కొన్ని రోజులకు అంటే గత ఆదివారం (జనవరి 7) రాత్రి షర్టు పట్టుకెళ్లటానికి సలీం వచ్చాడు.

దీంతో తాను కుట్టిన షర్టును సలీంకు ఇచ్చాడు. అక్కడిక్కడే షర్టు ధరించి చూసుకున్నాడు సలీం. కానీ చాలా టైటుగా ఉంది. అదేమని టైలర్ మజీద్ ఖాన్ పై సలీం ఆగ్రహం వ్యక్తంచేశాడు. నానా దుర్భాషలాడాడు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టాడు. అలా ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. అదికాస్తా..ఘర్షణకు దారి తీసింది.

ఆ ఘర్షణలో టైలర్ అబ్దుల్ మజీద్ ఖాన్ ను అక్కడే ఉన్న కత్తెరతో గొంతుకోసం చంపేశాడు. నెత్తుటి మడుగులో గిలగిలలాడుతూ మజీద్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సలీం అనే వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడని టైలర్ కుమారుడు అబ్దుల్ నయీమ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మజీద్ ఖాన్ మతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేంత వరకూ దీనిపై ఏ విషయం చెప్పలేమని రాయ్ బరేలీ ఎస్పీ శోక్ కుమార్ తెలిపారు. రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాయ్ బరేలీ ఎస్పీ, శ్లోక్ కుమార్ మాట్లాడుతూ, అబ్దుల్ మజీద్ ఖాన్ యొక్క పోస్ట్ మార్టం పరీక్షలో మరణానికి ఖచ్చితమైన కారణం వెల్లడించలేమని అన్నారు. టైరల్ కు, సలీం మధ్య పాత కక్షలేమైనా ఉన్నాయా? లేదా కేవలం షర్టు కుట్టే విషయంలో మాత్రమే వివాదం ఉందా? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.