పొలంలో పని చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి 13రోజులుగా అత్యాచారం

దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచ

పొలంలో పని చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి 13రోజులుగా అత్యాచారం

దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచులు దురాఘతాలకు ఒడిగడుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అర్థరాత్రే కాదు పట్టపగలు కూడా మహిళకు రక్షణ కరువైంది. పొలంలో పని చేసుకుంటున్న మహిళను అపహరించి గ్యాంగ్‌ రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు సుమారు రెండు వారాల పాటు నిర్బంధించి నరకం చూపారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది.

రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసుకుంటున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అలా 13 రోజులు ఆమెను బంధించి నానా రకాలుగా నరకం చూపారు. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడి తమ కామవాంఛ తీర్చుకున్నారు. కామాంధుల చెర నుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఏప్రిల్ 3న ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్బంధించి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 15 వరకూ నిందితులు తనను బంధించి గ్యాంగ్ రేప్ చేశారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోనూ ఇలాంటి దారుణమే జరిగింది. దుండిగల్ లో 14ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. బాలిక నివాసం ఉంటున్న ప్రాంతానికే చెందిన నలుగురు ఈ ఘోరానికి తెగబడ్డారు. లాక్ డౌన్ లోనూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.