స్నానం చేస్తున్నండగా వీడియో తీసి కోరిక తీర్చాలని వేధింపులు, మనస్తాపంతో నిప్పంటిచుకున్న తమిళనాడు టీనేజ్ అమ్మాయి

తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం జరిగింది. స్నానం చేస్తుండగా వీడియో తీసి, కోరిక తీర్చాలని ముగ్గురు

  • Published By: naveen ,Published On : June 16, 2020 / 06:58 AM IST
స్నానం చేస్తున్నండగా వీడియో తీసి కోరిక తీర్చాలని వేధింపులు, మనస్తాపంతో నిప్పంటిచుకున్న తమిళనాడు టీనేజ్ అమ్మాయి

తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం జరిగింది. స్నానం చేస్తుండగా వీడియో తీసి, కోరిక తీర్చాలని ముగ్గురు

తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం జరిగింది. స్నానం చేస్తుండగా వీడియో తీసి, కోరిక తీర్చాలని ముగ్గురు కుర్రాళ్లు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఒంటికి నిప్పంటించుకుంది. ఈ ఘటనలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. 90శాతం కాలిన గాయాలతో ప్రభుత్వ వెల్లూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. డాక్టర్లు బాలికకు చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పారు. బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియో తీసింది బాలికకు బాగా తెలిసిన వారే. బాలిక ఇంటి పక్కన ఆ ముగ్గురు కుర్రాళ్లు ఉంటారు.

కోరిక తీర్చాలని బాత్ రూమ్ వీడియోతో బ్లాక్ మెయిల్:
బాలిక వయసు 15 సంవత్సరాలు. ఓ రోజు బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా ఇంటి పక్కన ఉండే ముగ్గురు కుర్రాళ్లు దారుణానికి ఒడిగట్టారు. బాలిక బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశారు. ఈ వీడియో తీసిన వారిలో ఒకడు మైనర్(17). మరో ఇద్దరి వయసు 22, 19 ఏళ్లు. వీడియో తీయడమే కాకుండా ఆ నీచులు బాలికను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. తమ కోరిక తీర్చాలని వేధించారు. లేదంటే వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. రోజురోజుకి వారి వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక భయపడింది. ఏం చేయాలో తెలియక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. శనివారం(జూన్ 13,2020) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం 11గంటలకు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వచ్చారు. మంటలు ఆర్పి బాలికను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు వెంటనే ఇంటికి వచ్చారు.

ముగ్గురు నిందితుల్లో ఒకడు మైనర్:
రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆ ముగ్గురు నీచులను గుర్తించిన బాలిక వారి పేర్లను పోలీసులకు చెప్పింది. నిందితులు ఆకాష్, గణపతితో పాటు మైనర్ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. మైనర్ బాలుడికి బెయిల్ మంజూరు చేసి జువైనల్ హోమ్ కి తరలించారు. 

పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి:
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో పిల్లలు చెడుదారి పట్టడం ఆందోళనకు గురి చేస్తోంది. బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియో తియ్యడం, కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చెయ్యడం అందరిని షాక్ కి గురి చేసింది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్ లో ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని పోలీసులు సూచించారు. పిల్లలు చెడు దారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.