అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం….భరించలేక నవ వధువు సూసైడ్

  • Published By: chvmurthy ,Published On : March 14, 2020 / 06:28 AM IST
అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం….భరించలేక నవ వధువు సూసైడ్

భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళకు ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. తనకంటే చిన్నవాడైన ప్రియుడ్ని ఎలాగైనా ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంది. అందుకు ఒక దుష్ట పన్నాగం పన్నింది. దానికి కన్న కూతుర్ని బలిచేసింది. కట్టుకున్నభర్త, కన్నతల్లి మధ్య అక్రమ సంబంధం తెలిసిన కుమార్తె మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంది. 

హైదరాబాద్ మీర్ పేట, అల్మాస్ గూడలో నివాసం ఉండే వేలూరి అనితకు బాబూరావు అనే వ్యక్తితో 20ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి వందన, సంజన అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అనిత భర్త బాబూరావుతో విభేదాలు కారణంగా అతడి నుంచి  పిల్లలను తీసుకుని బయటకు వచ్చి వేరుగా కాపురం పెట్టింది.

Also Read :‘పోలవరం’కు లైన్‌ క్లియర్‌…రూ. 48వేల కోట్లు భరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

భర్త నుంచి విడిపోయిన తర్వాత నుంచి అనిత క్యాటరింగ్ పనులుచేస్తూ పిల్లలతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్ నవీన్ కుమార్ అనే  యువకుడితో పరిచయం ఏర్పడింది. నవీన్ తరచూ అనిత ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. దీంతో వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది.   

sucide 1

నవీన్ అప్పుడప్పుడూ వచ్చి వెళ్లకుండా శాశ్వతంగా తన వద్దే ఉండాలని అనిత ఆశించింది. అందుకు తన పెద్ద కూతురు నిచ్చి పెళ్లి చేయాలనుకుంది. పెద్ద కుమార్తె వందన(19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అందుకు ఆమెను కూడా ఒప్పించింది. తల్లి మనసులో కుట్ర తెలియని వందన పెళ్లికి ఒప్పుకుంది. గత ఏడాది డిసెంబర్ 1న వందన కు నవీన్ ఇచ్చి వివాహాం  జరిపించింది అనిత. అల్లుడు హోదాలోఇంట్లోకి ప్రవేశించిన నవీన్ తో అనిత తన సంబంధాన్నియధేఛ్ఛగా కొనసాగించసాగింది.  

sucie 2

వివాహామైన కొద్ది రోజులకు  తన తల్లితో భర్త జరుపుతున్న అక్రమ సంబంధాన్నివందన పసిగట్టింది. వారిద్దరి మధ్య సాగుతున్న అక్రమ సంబంధాన్ని తెలుసుకుంది. తల్లి దగ్గరనుంచి వెళ్లిపోయి విడిగా కాపురం పెడదామని భర్త నవీన్ కు చెప్పింది. దీంతో వందన ఇంట్లోంచి వెళ్లిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని తల్లి అనిత బెదిరించింది. తల్లి కుతంత్రాన్ని గ్రహించిన కూతురు వందన తల్లడిల్లిపోయింది. ఏం చేయాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. కన్నతల్లే తనను మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయింది. 

కట్టుకున్న భర్త ప్రవర్తన కూడా వందనను తీవ్రంగా కుంగదీసింది. ఏం చేయాలో పాలుపోలేదు. తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి చీరతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది.

Also Read : రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు 

ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసుల శవాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  సోదరి సంజన ఫిర్యాదు మేరకు తల్లిని, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన ఆనందం కోసం అక్రమ సంబంధం కోసం కన్నకూతుర్ని బలి చేసిన తల్లి కటకటాల్లో ఊచల లెక్కపెడుతోంది.  నిండు జీవితం గడపాల్సిన వందన 20 ఏళ్లకే తనువు చాలించింది. అక్రమ సంబంధాలు అనర్ధాలకు దారితీస్తాయని ఈ ఘటనతో మరోసారి రుజువయ్యింది.