Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం

సంతోష్, భరత్, హరితేజకు 2.5 లీటర్ల హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం

Drugs

Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఐదుగురు వ్యక్తుల నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురి నుంచి ఐదు ఫోన్లతో పాటు కారును సీజ్ చేశారు. అరెస్టు అయిన వ్యక్తులను ఏపీకి చెందిన జెమ్మిలి బండు, కాపు చందర్ రావు, ఈ.సంతోష్ రెడ్డి కర్మన్ ఘాట్, ఎన్ సాయి భరత్ (అంబర్ పేట్), వి.హరితేజ(సరూర్ నగర్)గా పోలీసులు గుర్తించారు.

బండు, చందర్ రావు కలిసి శుక్రవారం రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. సంతోష్, భరత్, హరితేజకు 2.5 లీటర్ల హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.5 లీటర్ల హాష్ ఆయిల్ ను రూ.80 వేలకు విక్రయించినట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది.

Drug Supply Gang Arrest : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.5 లీటర్ల హాష్ ఆయిల్ ను రూ.80 వేలకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. 5 మిల్లీ లీటర్ల సామర్థ్యం కలిగిన బాటిల్స్ లో హాష్ ఆయిల్ ను నింపి విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హాష్ ఆయిల్ ను కొనుగోలు చేస్తున్నవారిలో మెడికల్, ఐటీ ఉద్యోగులతో పాటు స్టూడెంట్స్, నిరుద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.